Project K: ప్ర‌భాస్ (Prabhas) సినిమా 'ప్రాజెక్ట్ కె'లో మ‌హేష్ బాబు.. మ‌రో ఇద్ద‌రు హీరోలు కూడా ఓకే చెప్పార‌ట‌

Updated on Sep 07, 2022 07:26 PM IST
Project K : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న‌ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో మ‌హేష్ బాబు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారా?.
Project K : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న‌ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో మ‌హేష్ బాబు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారా?.

Project Kపాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) సినిమా 'ప్రాజెక్ట్ కె'లో మ‌హేష్ బాబు న‌టిస్తున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మ‌హేష్ బాబుతో పాటు మ‌రో ఇద్ద‌రు ద‌క్షిణాది హీరోల‌ను'ప్రాజెక్ట్ కె' (Project K) లో న‌టించేందుకు ఒప్పించార‌ట‌. అటు బాలీవుడ్ నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకునే ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ కె' కోసం పాన్ ఇండియా లెవ‌ల్‌లో న‌టీన‌టుల‌ను సెలెక్ట్ చేశారు. ఇంత‌కీ ఈ సినిమాలో మ‌హేష్ బాబు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారా?.

Project K : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న‌ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో మ‌హేష్ బాబు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారా?.

పాన్ వ‌ర‌ల్ట్ సినిమా కోసం మ‌హేష్

హీరో ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కాంబోలో 'ప్రాజెక్ట్ కె' అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ పాన్ వ‌ర‌ల్ట్ సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించేందుకు ఇండియాలోని అన్ని భాష‌ల్లో న‌టీన‌టుల‌ను సెలెక్ట్ చేశార‌ట‌.

తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త‌మిళ్ నుంచి సూర్య‌, మ‌ల‌యాళం హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ 'ప్రాజెక్ట్ కె'లో న‌టించ‌నున్నారు. ఇక బాలీవుడ్ నుంచి బిగ్ బి, దీపికా, దిశా ప‌టానీలు ఈ సినిమాలో ఉండనే ఉన్నారు

Project K : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న‌ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో మ‌హేష్ బాబు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారా?.

ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తారో!

'బాహుబ‌లి'తో ప్రభాస్ (Prabhas), 'మ‌హాన‌టి'తో నాగ్ అశ్విన్ మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. ఇక వీరిద్ద‌రి కాంబోలో సినిమా అంటేనే ఆ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మ‌రో హీరోయిన్‌ను కూడా ఈ సినిమా కోసం సంప్ర‌దించ‌నున్నార‌ట‌. ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ న‌టించ‌నున్నారు. 'ప్రాజెక్ట్ కె' సినిమాను వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై సి. అశ్వినీ ద‌త్ నిర్మించ‌నున్నారు. 

వైజ‌యంతి మూవీస్ నిర్మాణ సంస్థ స్థాపించి 2020 నాటికి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా 'ప్రాజెక్ట్ కె' సినిమాను ప్ర‌క‌టించారు. కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా నిర్మాణం ఆల‌స్య‌మైంది. 'ఆదిపురుష్' రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.. అయితే 'ప్రాజెక్ట్ కె' మ‌హాభార‌తం నేప‌థ్యంలో చిత్రీక‌రిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకోస‌మే ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈసినిమాలో భాగ‌మ‌వుతున్నారు. 

Read More: Project K: ప్ర‌భాస్ (Prabhas) 'ప్రాజెక్ట్ కె' త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుందా!.. మేక‌ర్స్ ఇచ్చిన హింట్ వైర‌ల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!