NTR30: ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేస్తున్నారు - కొర‌టాల శివ! ఎన్టీఆర్ 30 సినిమాపై ఎక్స్‌క్లూజీవ్ అప్‌డేట్స్

Updated on Jun 28, 2022 07:08 PM IST
NTR30: ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం తెర‌కెక్కుతుంది- చిత్ర యూనిట్.
NTR30: ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం తెర‌కెక్కుతుంది- చిత్ర యూనిట్.

NTR30: టాలీవుడ్‌లో ఆర్.ఆర్.ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ రేంజ్ మ‌రింత పెరిగింది. ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాల ప్ర‌క‌ట‌న ప్రేక్ష‌కుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 చిత్రం తెర‌కెక్కుతుంది. ఇక కేజీఎఫ్‌తో వండ‌ర్స్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31ను నిర్మించ‌నున్నారు. కొర‌టాల శివ‌, ఎన్టీఆర్ కాంబో సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్స్ అందాయి.. ఆ వివరాలు ఏంటంటే..

ఎన్టీఆర్ 30 (NTR30) షూటింగ్ లేట‌వుతుందా?
చిరంజీవితో ఆచార్య తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ భారీ ఫ్లాప్‌ను అందుకున్నారు. ఆ డిజాస్ట‌ర్ నుంచి కొర‌టాల శివ ఎన్టీఆర్ 30 ప్ర‌క‌ట‌న‌తో బ‌య‌ట ప‌డ్డారు. ఎన్టీఆర్ 30 పోస్ట‌ర్ కొర‌టాల ఇమేజ్‌ను ఒక్క‌సారిగా పెంచేసింది. అయితే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ లేట్ అవుదంటూ ఓ న్యూస్ చ‌క్ల‌ర్లు కొడుతుంది. కొర‌టాల శివ ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మిస్తున్నార‌ని.. .అందుకే షూటింగ్ ఆల‌స్యం అవుతుందంటూ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ ఈ వార్త‌ల‌ను ఖండించింది.

NTR30: ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం తెర‌కెక్కుతుంది- చిత్ర యూనిట్.

 
 
ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం తెర‌కెక్కుతుంది. ఈ సినిమా స్కిప్ట్ వ‌ర్క్ కోసం ఆల‌స్యం అయిందంటూ వ‌చ్చిన వార్తల‌ను న‌మ్మెద్దు. ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఓ భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. 
చిత్ర యూనిట్
 

ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో ఎన్టీఆర్(NTR)
ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఎన్టీఆర్‌ను స‌రికొత్త‌గా ఎన్టీఆర్ 30లో చూపించ‌నున్నారు. ఎన్టీఆర్ ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థలో న‌టిస్తున్నార‌ని చెప్పారు. హీరోది చాలా బ‌ల‌మైన పాత్ర అన్నారు కొర‌టాల‌. ఇంత‌కు ముందు ఎప్పుడూ చూడ‌ని పాత్ర‌లో ఎన్టీఆర్‌ను వెండితెర‌పై చూపిస్తాన‌ని చెప్పారు. 

NTR30: ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం తెర‌కెక్కుతుంది- చిత్ర యూనిట్.

కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషనులో గతంలో విడుదలైన 'జనతా గ్యారేజ్' ఎంత పెద్ద సూపర్ హిట్టో మనకు తెలియంది కాదు. ఈ క్రమంలో ఈ కొత్త సినిమా పై కూడా అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి.

కల్యాణ్ రామ్,  మిక్కిలినేని సుధాకర్ నిర్మించే ఈ సినిమాకి, అనిరుధ్ పాటలకు బాణీలను సమకూర్చనున్నారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా శ్రీదేవి, బోనికపూర్‌‌‌ల కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట. అలాగే తమ సినిమాతోనే ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని ఆయన యోచిస్తున్నారట.

Read More:RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!