Ram Charan: రామ్ చరణ్‌తో భారీ యాక్ష‌న్ సీన్ల‌ను ప్లాన్ చేసిన‌ శంకర్

Updated on Jul 17, 2022 07:23 PM IST
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  త్రిపాత్రాభినయంలో ఆర్‌సీ 15లో క‌నిపించ‌నున్నార‌ట‌.
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  త్రిపాత్రాభినయంలో ఆర్‌సీ 15లో క‌నిపించ‌నున్నార‌ట‌.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వ‌స్తున్న సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వీరిద్ద‌రి కాంబోలో ఆర్‌సీ 15 అనే టెంప‌ర‌రీ టైటిల్‌తో సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. రామ్ చ‌ర‌ణ్‌తో మాస్ యాక్ష‌న్ సీన్ కోసం ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ట‌. 

మెగాస్టార్లు బిజీబిజీ
టాలీవుడ్‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో రామ్ త‌న న‌ట విశ్వరూపం చూపించారు. త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. కానీ రామ్ చ‌ర‌ణ్‌తో పాటు చిరంజీవికి కూడా ఆ సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఆచార్య చిత్రం త‌ర్వాత చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ త‌మ న‌ట‌న‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టారు. ఇద్ద‌రూ కొత్త సినిమా ప్రాజెక్టుల‌లో బిజీ అయ్యారు. 

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  త్రిపాత్రాభినయంలో ఆర్‌సీ 15లో క‌నిపించ‌నున్నార‌ట‌.

శంక‌ర్ మొద‌టి తెలుగు సినిమా
త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించే సినిమాలు ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి. భార‌తీయుడు, రోబో వంటి చిత్రాల‌తో శంక‌ర్ సినీ రంగంలో రికార్డుల‌ను సృష్టించారు. శంకర్ తమిళ, హిందీ హీరోలతో త‌ప్ప తెలుగు హీరోల‌ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేదు.

శంక‌ర్ మొద‌టి సారి తెలుగు హీరో రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఆర్‌సీ 15 అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న సినిమాను దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూ. 170 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

భారీ యాక్ష‌న్ సీన్స్
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  త్రిపాత్రాభినయంలో ఆర్‌సీ 15లో క‌నిపించ‌నున్నార‌ట‌. రామ్ చరణ్.. తండ్రి.. ఇద్దరు కుమారులుగా నటించబోతున్నట్టు సమాచారం. రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ల‌కు సంబంధిన భారీ యాక్ష‌న్ సీన్ల‌ను శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నార‌ట‌. అందుకోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్టింగులు వేశార‌ట‌. ఓ కొత్త త‌ర‌హా ఫైట్ సీన్లు ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాయట‌. 

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  త్రిపాత్రాభినయంలో ఆర్‌సీ 15లో క‌నిపించ‌నున్నార‌ట‌.

ఓటీటీ హ‌క్కులు అన్ని కోట్లా
రామ్ చ‌ర‌ణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుక‌గా రామ్ చ‌ర‌ణ్ ఆర్‌సీ 15 రిలీజ్ కానుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసింద‌ట‌.

Read More:  హై ఓల్టేజ్ ప‌వ‌ర్ ఉన్న క్యారెక్ట‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ సృష్టించాడా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!