Mahesh Babu : ఫ్యామిలీతో రోడ్ ట్రిప్లో ప్రిన్స్ మహేష్ బాబు.. సెల్ఫీ వైరల్ !
![Mahesh Babu and his Family in Italy Tour Mahesh Babu and his Family in Italy Tour](https://telugust.pinkvilla.com/telugu/images/2022/Jun/1076162029_mahesh-babu-italy-vacation_1280*720.webp)
Mahesh Babu : మహేష్ బాబు.. టాలీవుడ్ సూపర్ స్టార్. ఇటీవలే ఆయన నటించిన 'సర్కారు వారి పాట' చిత్రం విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. అలాగే తాను నిర్మాతగా ఉండి తీసిన 'మేజర్' చిత్రం కూడా దేశ వ్యాప్తంగా ప్రశంసలను పొందుతోంది. ఇక దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Mahesh Babu : మహేష్ బాబు సాధారణంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. సినిమాలు లేనప్పుడు, ఎక్కువగా కొత్త స్క్రిప్ట్స్ వినే పనిలో ఉంటారు. అలాగని చెప్పి.. తన కుటుంబానికి సమయాన్ని కేటాయించే విషయం మాత్రం మర్చిపోరు. వీలునప్పుడల్లా తన భార్య, బిడ్డలతో విదేశీ టూర్లు చేస్తుంటారు. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు.
ఇటలీకి వెళ్లే దారిలో మహేష్
ఇటీవలే మహేష్ బాబు తన కొత్త ట్రిప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. తాను 'ఇటలీ దేశానికి వెళ్లే దారిలో ఉన్నట్లు' ఆయన ఆ ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫోటోలో మనం మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ .. అలాగే పిల్లలు సితార, గౌతమ్లను కూడా చూడవచ్చు.
సితార .. రూటే సెపరేటు
Mahesh Babu : మహేష్ బాబు కుమార్తె సితార ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. స్టార్ కిడ్స్లో ఈమెకు ఉన్న పాపులారిటీయే వేరు. అలాగే ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ను కూడా నడుపుతుంది. అప్పుడప్పుడు తన తండ్రికి పంచ్లు, కౌంటర్లు కూడా విసురుతూ ఉంటుంది.
తాజాగా మహేష్ బాబు (Mahesh Babu) పోస్టు చేసిన ఫోటోకి నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్.. స్మైలీలతో రిప్లై ఇచ్చింది. #VacayMode అనే హ్యాష్ ట్యాగ్తో ప్రస్తుతం మహేష్ పోస్టు చేసిన ఫోటో ట్విటర్లో బాగా వైరల్ అవుతోంది. అలాగే ఇన్స్టాగ్రాంలో కూడా సందడి చేస్తోంది. మహేష్ బాబుకి ఇన్స్టాలో దాదాపు 8.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
![](https://www.pinkvilla.com/imageresize/user-no-image.jpg?format=webp&width=32)