Mega 154: 'వాల్తేరు వీరయ్య'కి రవితేజ ఏమ‌వుతారు? చిరంజీవి (Chiranjeevi) సినిమా లేటెస్ట్ అప్‌డేట్ !

Updated on Jul 26, 2022 08:49 PM IST
 చిరంజీవి (Chiranjeevi) 'మెగా 154' సినిమా న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చిరు త‌మ్ముడిగా ర‌వితేజ వెండితెర‌పై క‌నిపించ‌నున్నార‌ట‌. 
చిరంజీవి (Chiranjeevi) 'మెగా 154' సినిమా న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చిరు త‌మ్ముడిగా ర‌వితేజ వెండితెర‌పై క‌నిపించ‌నున్నార‌ట‌. 

టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరో చిరంజీవి (Chiranjeevi) కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నారు. అయినప్పటికీ, ఇటీవలే కుమారుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన‌ 'ఆచార్య' సినిమా చిరంజీవికి భారీ డిజాస్ట‌ర్ మిగిల్చింది.

దీంతో నిరాశ‌లో ఉన్న అభిమానుల‌కు మళ్లీ వినోదాన్ని పంచేందుకు ఆయన పలు సినిమాలు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం చిరు నటిస్తున్న 'మెగా 154' సినిమా గురించిన ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చిరంజీవి త‌మ్ముడిగా ర‌వితేజ‌?

'ఆచార్య' త‌ర్వాత చిరంజీవి (Chiranjeevi) 'గాడ్ ఫాద‌ర్', 'మెగా 154' సినిమాల్లో న‌టిస్తున్నారు. 'మెగా 154' చిత్రానికి 'వాల్తేరు వీర‌య్య' అనే టైటిల్ ఖ‌రారు చేయ‌నున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప‌లు అప్‌డేట్స్ రిలీజ్ అయ్యాయి. 'వాల్తేరు వీర‌య్య‌'లో హీరో ర‌వితేజ కూడా న‌టిస్తున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ త‌న సోష‌ల్ మీడియాలో తెలిపింది. ఓ మాస్ పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తున్నార‌ని టాక్. అంతేకాదు చిరంజీవికి త‌మ్ముడిగా ర‌వితేజ వెండితెర‌పై క‌నిపించ‌నున్నార‌ట‌. 

 చిరంజీవి (Chiranjeevi) 'మెగా 154' సినిమా గురించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 

చిరంజీవి పాత్ర..

'మెగా 154' సినిమాలో చిరంజీవి ఓ మత్స్యకారుడి పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ట‌.ద‌ర్శ‌కుడు బాబి స‌రికొత్త క‌థ‌తో 'వాల్తేరు వీర‌య్య' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి, ర‌వితేజ అన్న‌ద‌మ్ములుగా ఈ సినిమాలో న‌టిస్తున్నార‌ట‌. ఇద్దరూ సవతి తల్లి పిల్లలుగా క‌నిపిస్తార‌ని..  సినిమాలో వీరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, ఆవేశపూరితమైన సంభాషణలు కూడా ఉంటాయ‌నే వార్త‌లు అంతర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

'మెగా 154' సినిమాలో చిరంజీవికి (Chiranjeevi)  జోడిగా శృతి హాసన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ద‌ర్శ‌కుడు ఓ పవర్ ఫుల్ యాక్టర్‌ని సెల‌క్ట్ చేశార‌ట. లేడీ విలన్‌ క్యారెక్టర్లకు పెట్టింది పేరైన త‌మిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్రను పోషిస్తున్నారని టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read More : Raviteja & Chiranjeevi: 'మెగా 154' (Mega 154) షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన మాస్ మహారాజ్ రవితేజ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!