Keerthy Suresh: మైండ్ బ్లాంక్ అయింది.. అందుకే మ‌హాన‌టి త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌లేదు : కీర్తి సురేష్

Updated on Jun 16, 2022 03:45 PM IST
మ‌హాన‌టి త‌ర్వాత త‌న‌కు వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని కీర్తి  (Keerthy Suresh)  వెల్ల‌డించారు.
మ‌హాన‌టి త‌ర్వాత త‌న‌కు వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని కీర్తి  (Keerthy Suresh)  వెల్ల‌డించారు.

మ‌హాన‌టి  చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన న‌టి కీర్తి సురేష్ (Keerthy Suresh). సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో కీర్తి సురేష్‌కు మంచి పేరుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో  'మ‌హాన‌టి ' సినిమా త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌కపోవ‌డానికి కార‌ణం ఏంటో తెలిపారు కీర్తి. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌తో కీర్తి సురేష్ హ్యాపీగా ఉన్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తాన‌న్నారు. 

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తా : కీర్తి సురేష్
మ‌హాన‌టి త‌ర్వాత త‌న‌కు వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని కీర్తి  (Keerthy Suresh)  వెల్ల‌డించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప‌క్క‌న పెట్టి క‌థానాయ‌కురాలి పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తే మంచిదన్నారు. 

మ‌హాన‌టి సినిమా స‌క్సెస్ త‌ర్వాత, తాను ఎంచుకునే సినిమాల విష‌యంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేదని తనకు అనిపించింది అన్నారు కీర్తి. అందుకే క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌లేక‌పోయాన‌న్నారు. 

తాను న‌టించ‌బోయే సినిమాలు ఇకమందు చాలా విభిన్నంగా ఉంటాయ‌ని కీర్తి సురేష్ తెలిపారు. ల‌వ్, ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తాన‌న్నారు. అంతేకాకుండా మ‌హిళ‌ల‌లో ప్రేరణను నింపే కథలను చేసేందుకు తాను ఎప్పుడు రెడీగా ఉంటాన‌ని తెలిపారు.

కీర్తి సురేష్ ప్ర‌స్తుతం చిరంజీవి సినిమాలో న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే, హీరో నానితో క‌లిసి ద‌సరా చిత్రంలో కూడా న‌టించ‌నున్నారు. 

మ‌హాన‌టి త‌ర్వాత త‌న‌కు వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని కీర్తి  (Keerthy Suresh)  వెల్ల‌డించారు.

మ‌హాన‌టిని క‌ళావ‌తి చేశార‌న్న కీర్తి
మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట విశ్వ‌రూపం చూపారు కీర్తి సురేష్. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో నటించినందుకు గాను నేష‌న‌ల్ అవార్డు పొందారు. ఇదే పాత్ర ఆమెకు చాలా పాపులారిటీని తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా త‌ర్వాత కీర్తి సురేష్ రేంజ్ మరింత పెరిగింది. కానీ కీర్తి సురేష్.. మ‌హాన‌టి మూవీ త‌ర్వాత న‌టించిన చిత్రాలు అంత పెద్ద హిట్ సాధించ‌లేదు.  

'స‌ర్కారు వారి పాట‌' (Sarkaru Vaari Paata) చిత్రంలో మ‌హేష్ బాబుకు జోడిగా క‌ళావ‌తి క్యారెక్ట‌ర్‌తో కీర్తి న‌టించారు. మ‌హేష్, కీర్తిల  మ‌ధ్య కెమిస్ట్రీ బాగుందంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. క‌ళావ‌తిగా కీర్తి ఇమేజ్ ఇంకా పెరిగింది. మ‌హాన‌టి అని పిలిచే వారు ఇప్పుడు 'క‌ళావ‌తి' అని కీర్తి సురేష్  (Keerthy Suresh) ను పిలుస్తున్నారట‌. 

Read More:వెడ్డింగ్ పార్టీలో మ‌హాన‌టి ! నా వాళ్ల‌తో క‌లిసి గాడ్ కంట్రీలో ఉన్నాను : కీర్తి సురేష్ (Keerthy Suresh)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!