Exclusive: డైరెక్టర్ సుకుమార్ నా పేరును మార్చేశారు.. అందరూ 'సామి గర్ల్' అంటున్నారు : రష్మిక మందన్న (Rashmika Mandanna)

Updated on Oct 27, 2022 07:12 PM IST
'సాక్షి ఎక్సలెన్స్ అవార్ట్స్ 2021' వేడుకల్లో రష్మిక మందన్న (Rashmika Mandanna)  మెరిసిపోయారు. రెడ్ కలర్ డ్రెస్‌లో రష్మిక అందరి మనసులను ఫిదా చేసేశారు.
'సాక్షి ఎక్సలెన్స్ అవార్ట్స్ 2021' వేడుకల్లో రష్మిక మందన్న (Rashmika Mandanna) మెరిసిపోయారు. రెడ్ కలర్ డ్రెస్‌లో రష్మిక అందరి మనసులను ఫిదా చేసేశారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) 'పుష్ప' సినిమా తరువాత జాతీయ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకున్నారు. సౌత్‌లోనే టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక 'పుష్ప'తో నార్త్‌లోనూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. 

'సామి.. సామి..' పాటలో రష్మిక మందన్న స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. సౌత్, నార్త్ సినిమాల్లో నటిస్తూ రష్మిక మందన్న తన యాక్టింగ్ పవర్ ఏంటో చూపించనున్నారు. 

పాపులర్ నటి

'సాక్షి ఎక్సలెన్స్ అవార్ట్స్ 2021' వేడుకల్లో రష్మిక మందన్న మెరిసిపోయారు. రెడ్ కలర్ డ్రెస్‌లో రష్మిక అందరి మనసులను ఫిదా చేసేశారు. రెడ్ క్రాప్ టాప్‌లో రష్మిక దేవకన్యలా కనిపించారు.  'పుష్ప'లో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న మోస్ట్ పాపులర్ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డును అందించిన సాక్షి మీడియాకు థ్యాంక్స్ చెప్పారు రష్మిక మందన్న.

'సాక్షి ఎక్సలెన్స్ అవార్ట్స్ 2021' వేడుకల్లో రష్మిక మందన్న (Rashmika Mandanna)  మెరిసిపోయారు. రెడ్ కలర్ డ్రెస్‌లో రష్మిక అందరి మనసులను ఫిదా చేసేశారు.

రష్మికతో డాన్స్ చేయించిన దేవిశ్రీ
సాక్షి ఎక్సలెన్స్ అవార్ట్స్ వేడుకల్లో బహుళ ప్రజాదరణ పొందిన ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్న రష్మిక  (Rashmika Mandanna).. పలు విషయాలను అందరితో పంచుకున్నారు. తన పేరును దర్శకుడు సుకుమార్ రెండు సార్లు మార్చేశారని తెలిపారు. రష్మిక మందన్నకు బదులుగా 'రష్మిక మదన' అని గతంలో పిలిచేవారన్నారు. 

ఆ తరువాత 'పుష్ప' సినిమాలో తనను 'శ్రీవల్లి' పేరుతో సంబోధిస్తూ సుకుమార్ కొత్త పాత్రను డిజైన్ చేయడం వల్ల, తాను ప్రేక్షకుల దృష్టిలో కూడా శ్రీవల్లిగా మారిపోయానని తెలిపారు. అంతేకాకుండా 'సామి.. సామి' అనే పాట బాగా పాపులర్ అవ్వడంతో.. కొందరు తనను 'సామి గర్ల్' అని కూడా పిలుస్తుంటారని రష్మిక మందన్న తెలిపారు.

'సామి.. సామి' పాటకు విపరీతమైన క్రేజ్ రావడం వల్ల.. తాను ఇండియా మొత్తం పాపులర్ అయ్యారని తన మనసులోని మాటను బయటపెట్టారు రష్మిక. అలాగే ఆ పాటను కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ తనతో కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని రష్మిక మందన్న రిక్వెస్ట్ చేశారు. 

అయితే ఓ ఆడియన్‌గా తాను రష్మిక డాన్స్ చూడాలనుకుంటున్నానని దేవిశ్రీ అనడంతో.. రష్మిక ఓకే చెప్పారు. రష్మిక 'సామి' పాటను హీరోయిన్ కృతి శెట్టితో కలిసి చేశారు. రష్మిక మందన్న సామి పాటకు వేసిన స్లెప్పులతో అవార్డుల వేడుకల్లో సందడి నెలకొంది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022 ఈవెంట్ అక్టోబర్ 29 తేదీన సాయంత్రం 5 గంటలకు సాక్షి టీవీలో ప్రసారం కానుంది.

రష్మిక @ వరల్డ్ క్రష్
ప్రస్తుతం రష్మిక మందన్న  (Rashmika Mandanna) 'పుష్ప - ది రైజ్ సినిమా' సీక్వెల్ అయిన 'పుష్ప - ది రూల్'లో నటిస్తున్నారు. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో మొదటిసారి నటిస్తున్న 'వారసుడు' చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఇక బాలీవుడ్ హీరో కార్తీక్ నటిస్తున్న 'ఆషికి 3'లో రష్మిక మందన్న కూడా నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా పేరున్న రష్మిక మందన్న తన సినిమాలతో వరల్డ్ క్రష్‌గా మారతారని అభిమానులు అంటున్నారు.

Read More: Exclusive: సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్ లేకపోతే 'పుష్ప' లేనే లేదు: సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకల్లో అల్లు అర్జున్ (Allu Arjun) 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!