Pavithra Puri: సినీ రంగంలో నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభిస్తున్న.. పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర !

Updated on Jun 18, 2022 02:09 PM IST
పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) కూతురు ప‌విత్ర‌ కూడా సినిమాల‌నే త‌న కెరియ‌ర్‌గా ఎంచుకోనున్నార‌ట‌.
పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) కూతురు ప‌విత్ర‌ కూడా సినిమాల‌నే త‌న కెరియ‌ర్‌గా ఎంచుకోనున్నార‌ట‌.

టాలీవుడ్‌ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాల‌కు ఉన్న  క్రేజే వేరు. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌పై పూరి జ‌గ‌న్నాథ్ ఎక్కువ ఫోక‌స్ పెడ‌తారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం చేయడంతో పాటు ప్రొడ్యూసర్‌గా కూడా కొన్ని సినిమాల‌ను నిర్మిస్తున్నారు. 'పూరీ కనెక్ట్స్' అనే పేరుతో ఓ ప్రొడక్ష‌న్ కంపెనీని కూడా ప్రారంంభించారు. ఈ కంపెనీ ద్వారా నిర్మించే సినిమాలకు హీరోయిన్ ఛార్మీ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే,  సినిమా రంగానికి చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు సాధారణంగా త‌మ వారసుల‌ను కూడా ఈ రంగానికి ప‌రిచ‌యం చేయాల‌నుకుంటారు. చాలా మంది హీరోలు అలాగే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) కుమారుడు ఆకాశ్ పూరి కూడా హీరోగా త‌న స‌త్తా చాటేందుకు రెడీ అయ్యాడు. వ‌రుస సినిమాల‌తో త‌న టాలెంట్ ఏంటో ప్రేక్ష‌కుల‌కు చూపిస్తున్నాడు. 

నిర్మాత‌గా మార‌నున్న‌ పూరీ కూతురు
ఇదే క్రమంలో దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) కూతురు ప‌విత్ర‌ జ‌గ‌న్నాథ్ (Pavithra Jagannadh) కూడా సినిమాల‌నే త‌న కెరీర్‌గా ఎంచుకోనున్నార‌ట‌. భవిష్యత్తులో నిర్మాత‌గా ప‌విత్ర, తన తండ్రి పూరీ దర్శకత్వం వహించే సినిమాలను ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఇటీవలే సినిమాల ప‌ట్ల త‌న‌కు ఉన్న ఇష్టాన్ని తండ్రితో పంచుకున్నారట ప‌విత్ర‌. కూతురి ఇష్టాన్ని తెలుసుకున్న పూరి జ‌గ‌న్నాథ్ త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ బాధ్యతలను కొన్ని రోజులు చూసుకోమ‌ని చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత సొంత సినిమా ఒకటి నిర్మించ‌మ‌ని పూరీ  సలహా అందించారట.

పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) కూతురు ప‌విత్ర‌ జ‌గ‌న్నాథ్ కూడా సినిమాల‌నే త‌న కెరియ‌ర్‌గా ఎంచుకోనున్నార‌ట‌.

పూరి కనెక్ట్స్ బ్యానర్ బాధ్య‌త‌ల‌ను ప్రస్తుతం హీరోయిన్ ఛార్మి కౌర్ చూసుకుంటున్నారు. ఇక పూరి, ఛార్మి క‌లిసి నిర్మాణ వ్య‌వ‌హారాలలోని కీలక నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అలాగే ఛార్మి తమ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ పరిధిలోని రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇక పూరీ కూతురు ప‌విత్ర కూడా, వీరితో క‌లిసి పని చేయనున్నారు. నిర్మాణ సంస్థ కార్యకలాపాలలో తనదైన పాత్రను పోషించనున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర నిర్మాత‌గా మారడంపై అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ 'లైగ‌ర్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ 'లైగ‌ర్' సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. ఈ  సినిమా తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరి 'జ‌న‌గ‌ణ‌మ‌న' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  లైగ‌ర్, జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh).

Read More: Jana Gana Mana: జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ మొద‌లు పెట్టిన పూరి జ‌గన్నాథ్.. రౌడీ హీరో (Vijay Deverakonda) ఎక్క‌డ అంటున్న ఫ్యాన్స్‌

పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) కూతురు ప‌విత్ర‌ జ‌గ‌న్నాథ్ కూడా సినిమాల‌నే త‌న కెరియ‌ర్‌గా ఎంచుకోనున్నార‌ట‌.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!