Rana Naidu : రానా నాయుడు సిరీస్‌తో కొత్త ట్రెండ్‌‌కు శ్రీకారం చుట్టిన బాబాయ్ - అబ్బాయ్ .. ఫోటోలు వైరల్ !

Updated on Jun 04, 2022 02:26 PM IST
రానా నాయుడు (Rana Naidu) షూటింగ్ ర్యాప్ అప్ అయిపోయింది. ఇక మీరు మీ అభిమాన తారలను స్క్రీన్‌పై చూసేయండి. అందుకు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు
రానా నాయుడు (Rana Naidu) షూటింగ్ ర్యాప్ అప్ అయిపోయింది. ఇక మీరు మీ అభిమాన తారలను స్క్రీన్‌పై చూసేయండి. అందుకు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు

టాలీవుడ్‌ పరిశ్రమలో బాబాయ్ - అబ్బాయ్ కాంబినేషన్ ఇప్పుడు వర్కవుట్ కాబోతోంది. త్వరలోనే ఓటీటీ తెరపై ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రహ్మరథం పట్టబోతున్నారు ప్రేక్షకులు. వెంకటేష్ & రానా దగ్గుబాటి లీడ్ క్యారెక్టర్స్ పోషించే ఓ వెబ్ సిరీస్‌ ఇటీవలే షూటింగ్ ముగించుకుంది. ఆ సిరీస్ పేరే 'రానా నాయుడు (Rana Naidu)'. 

ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. జనవరి నెలలో ప్రకటించిన ఈ సిరీస్ షూటింగ్ మొత్తం ఇటీవలే పూర్తయింది. తాజాగా ఈ సిరీస్ నిర్మాతలు సోషల్ మీడియాలో  కొన్ని ఆసక్తికరమైన చిత్రాలను పంచుకున్నారు

అలాగే ట్విట్టర్‌లో ఈ సిరీస్ సమాచారాన్ని అందిస్తూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా పలు అంశాలను పేర్కొంది "మీ సోమవారాన్ని మరింత మెరుగ్గా మార్చడానికే ఈ వార్త.  రానా నాయుడు (Rana Naidu) షూటింగ్ ర్యాప్ అప్ అయిపోయింది. ఇక మీరు మీ అభిమాన తారలను స్క్రీన్‌పై చూసేయండి. అందుకు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు" అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా పేర్కొంది.

ఇటీవలే రానా దగ్గుబాటి, వెంకటేష్, సుర్వీన్ చావ్లా.. ఈ ముగ్గురు ముంబై బాంద్రాలోని ఒక రెస్టారెంట్ బయట కెమెరామెన్ కళ్లకు చిక్కి, ఫోటోలకు ఫోజులిచ్చారు. రానా నాయుడు (Rana Naidu) షూటింగ్ ముగింపు వేడుకలను జరుపుకోవడానికి వారు అక్కడికి వచ్చారు. 

 

రానా నాయుడు (Rana Naidu) సిరీస్ అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్‌‘ ఆధారంగా తెరకెక్కింది. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా ఎల్‌ఎల్‌పికి చెందిన సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్‌‌కు కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం, రానా దగ్గుబాటి నటించిన టాలీవుడ్ చిత్రం 'విరాట పర్వం' విడుదలకు సిద్ధంగా ఉంది. దీని రిలీజ్ కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం నుండి వాయిదా పడింది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.  వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 1990ల నాటి తెలంగాణ ప్రాంత నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగుతుంది. విరాట పర్వం జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మరోవైపు, వెంకటేష్ ప్రస్తుతం F3 సక్సెస్ మీట్‌లో పాల్గొని విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. 2019 బ్లాక్‌ బస్టర్ చిత్రం ‘F 2 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‘ చిత్రానికి సీక్వెల్ అయిన ‘F 3‘ సినిమాతో ఈ విక్టరీ స్టార్ మరో హిట్ కొట్టాడు. ఈ తెలుగు సినిమా మే 27న థియేటర్లలో విడుదలై, అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలను రాబట్టింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!