కేజీఎఫ్–3లో విలన్గా రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించనున్నాడా?

Updated on May 08, 2022 08:35 PM IST
దగ్గుబాటి రానా(Rana Daggubati), హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్
దగ్గుబాటి రానా(Rana Daggubati), హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్

భారీ అంచనాల మధ్య విడుదలై  బాక్సాఫీస్​ రికార్డుల్ని తిరగరాస్తున్న చిత్రం ‘కేజీఎఫ్–2’.  ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల మాదిరిగానే 1000 కోట్ల మార్కును దాటి ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కేజిఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.  ఈ సినిమాలో విలన్​గా రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించబోతున్నారనీ వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.

 

కేజీఎఫ్​–2 మాదిరిగానే ఈ సినిమా సీక్వెల్​గా రూపొందే కేజీఎఫ్ 3 సినిమా కూడా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఈ భాగంలో హీరో ఏవిధంగా బతికాడు అన్నది తెలిసిపోతుంది.ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 3 సినిమాలో విలన్ గా ఎవరు ఉండబోతున్నారు అన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే ఈ సినిమాలో విలన్ గా రానా నటించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇటీవల రానా ట్విట్టర్ లో కేజీఎఫ్ 2 సినిమా గురించి పొగుడుతూ ట్వీట్ చేయగా దానికి ప్రశాంత్ నీల్​ స్పందిస్తూ త్వరలోనే కలుద్దాం అని రాసుకొచ్చారు. కాగా కేజీఎఫ్ 3 ఈ సినిమాలో రానా విలన్ గా నటించబోతున్నాడన్న వార్తల కి ఈ ట్వీట్​ బలం చేకూర్చినట్లయింది.

‘కేజీయఫ్‌’ సినిమాల సిరీస్‌లో హీరో ఎంత ఫేమసో, విలన్లు కూడా అంతే ఫేమస్‌. సినిమాలో హీరో యశ్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో విలన్‌ గా రానా అయితే సినిమా కి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.ఇప్పటికే రానా విలన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు ..భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా ఇరగదీశాడు.  అయితే కేజిఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 లో విలన్లు చనిపోయారు. క్లైమాక్స్ లో కూడా హీరో చనిపోయిన విషయం తెలిసిందే.  మరి మూడో భాగంలో ప్రశాంత్​ విలన్​గా రానాని ఏ విధంగా చూపుతాడోనని అభిమానుల్లో చర్చ మొదలైంది.  తాజాగా వైరల్ అవుతున్న ఈ వార్త నిజమైతే సినిమా కి మరింత హైప్ ఇచ్చిన్నత్లే అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు.

కెరీర్​ ఆరంభం నుంచీ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్​ ఇమేజ్​ని సాధించుకున్నారు రానా దగ్గుబాటి. హీరో, విలన్​ అనే తేడా లేకుండా నటనకు ఆస్కారమున్న పాత్రల్ని చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అరణ్యలో తన సహజ నటనతో ఆకట్టుకున్న రానా నటించిన తదుపరి చిత్రం విరాటపర్వం. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని ఇటీవలే సురేష్​ ప్రొడక్షన్​ ప్రకటించింది. రానా (Rana Daggubati), సాయిపల్లవి జంటగా న‌టంచిన విరాట‌ప‌ర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!