Parasuram: స‌ర్కారు వారి పాటపై డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ ఏమ‌న్నారంటే..

Updated on May 07, 2022 05:58 PM IST
సర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్‌తోనే ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ (Parasuram) అంచ‌నాల‌ను మ‌రింత పెంచారు. హీరో మ‌హేష్ బాబుతో కొత్త ప్ర‌యోగం చేశాన‌ని ప‌రుశురామ్ అంటున్నారు
సర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్‌తోనే ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ (Parasuram) అంచ‌నాల‌ను మ‌రింత పెంచారు. హీరో మ‌హేష్ బాబుతో కొత్త ప్ర‌యోగం చేశాన‌ని ప‌రుశురామ్ అంటున్నారు

సర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్‌తోనే ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ (Parasuram) అంచ‌నాల‌ను మ‌రింత పెంచారు. హీరో మ‌హేష్ బాబుతో కొత్త ప్ర‌యోగం చేశాన‌ని ప‌రుశురామ్ అంటున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్కారు వారి పాట మే 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా డైరెక్ష‌న్ గురించి డైరెక్ట‌ర్ ఏమ‌న్నారంటే...

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా కొద్ది రోజుల్లో అంటే మే 12 రిలీజ్ కానుంది. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(Parasuram) స‌ర్కారు వారి పాట సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పారు. ప‌రుశురామ్ చెప్పిన విశేషాలు ఆస‌క్తిగా మారాయి. సినీ వ‌ర్గాల్లో కూడా ప‌రుశురామ్ మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(Parasuram) తీసిన మొద‌టి సినిమా గీతాగోవిందం. మ‌హేష్ బాబుతో మాస్ యాక్ష‌న్ సినిమాగా స‌ర్కారు వారి పాట‌ను ప‌రుశురామ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌తో ప‌రుశురామ్ సినీ వ‌ర్గాల్లో టాక్ ఆఫ్ ది డైరెక్ట‌ర్ అయ్యారు. 

నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ మ‌హేష్ బాబు చెప్పిన డైలాగులు తెగ పాపుల‌ర్ అయ్యాయి. ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ చెప్పారు. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌లో మ‌హి వి. రాఘ‌వ డైర‌క్ష‌న్లో నేను విన్నాను.. నేను ఉన్నాను.. డైలాగు పాపుల‌ర్ అయింది. వైఎస్ఆర్ మాట‌ల‌ను సినిమాలో హై లెట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా పాద‌యాత్ర‌లో ఇవే డైలాగుల‌తో ప్ర‌జ‌ల్లో పాపుల‌ర్ అయ్యారు. పొలిటిక‌ల్ డైలాగులు స‌ర్కారు వారి పాట సినిమాలో ప‌రుశురామ్ ఎందుకు యాడ్ చేశారో అనే డౌట్ ప్ర‌తీ ఒక్క‌రిలో ఉంది. అందుకు ప‌రుశురామ్ రీజ‌న్ చెప్పారు. హీరో మహేష్‌గారు కీర్తి సురేష్‌కి మాట ఇవ్వాల్సి వ‌చ్చిన‌ప్పుడు నేను విన్నాను.. నేను ఉన్నాన‌నే డైలాగ్ బాగుంటుంద‌ని యాడ్ చేశార‌ట ప‌రుశురామ్(Parasuram).

పరుశురామ్ హీరోయిన్ రోల్ కూడా హైలెట్ చేస్తార‌ని.. అందుకే త‌ను స‌ర్కారు వారి పాట సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నాన‌ని హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పారు. ఈ సినిమాలో మ‌హేష్‌తో స్పెష‌ల్ డాన్సులు చేయించాన‌ని కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్పారు. సినిమా లేటైనందుకు మ‌హేష్ బాబు కొంత ఫీల్ అయ్యార‌ని ప‌రుశురామ్ అన్నారు. స‌ర్కారు వారి పాట సినిమాకు రెండు గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!