Karthikeya 2 : కార్తికేయ 2 సినిమా టీమ్‌కు ఇస్కాన్ ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యేక ఆహ్వానం !

Updated on Jul 18, 2022 04:00 PM IST
కార్తికేయ 2 పై నిఖిల్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.  అలాగే కథాంశం కొత్తగా ఉండడంతో, పాన్ ఇండియా స్థాయిలో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.
కార్తికేయ 2 పై నిఖిల్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే కథాంశం కొత్తగా ఉండడంతో, పాన్ ఇండియా స్థాయిలో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'కార్తికేయ'  (Karthikeya) సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల తర్వాత, ఇదే చిత్రానికి సీక్వెల్ తీయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా, నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న 'కార్తికేయ'సీక్వెల్‌ను పూర్తిగా కొత్త కథతో తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. 

ఈ మధ్యకాలంలో ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కృష్ణుడు ఏలిన ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి ఇటీవలే ఇస్కాన్ ప్రధాన కార్యాలయం నుండి ఒక ప్రత్యేక ఆహ్వానం వచ్చిందట. 

కొత్త వీడియో రిలీజ్

ఈ విశేషాలను పంచుకుంటూ హీరో నిఖిల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. "మా కార్తికేయ 2 (Karthikeya 2) టీమ్‌కు బృందావన్‌లోని ఇస్కాన్ ప్రధాన కార్యాలయం నుండి ఆహ్వానం అందడం ఎంతో ఆనందంగా ఉంది. వారు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. 

అలాగే మమ్మల్ని భక్తులతో మాట్లాడించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మేం ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్‌ను ఇస్కాన్ ఆలయంలోనే రిలీజ్ చేయడానికి సంకల్పించాము. అలాగే సినిమా విడుదల తేదిని కూడా అక్కడే ప్రకటిస్తాం" అని నిఖిల్ (Nikhil) ఈ వీడియోలో తెలిపారు. 

ఈ వీడియోతో పాటు ఇస్కాన్ సంస్థ పంపిన ఉత్తరాన్ని కూడా సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు నిఖిల్ (Nikhil). ఇస్కాన్ లాంటి సంస్థ ఇలా తమ సినిమా గురించి మాట్లాడాలనుకోవడం తమకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. 

Read More: "ఆజ్యం అక్క‌డ మ‌ళ్లీ మొద‌లైంది".. ఉత్కంఠభరితంగా కార్తికేయ 2 ట్రైలర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!