Karthikeya 2 Trailer: "ఆజ్యం అక్క‌డ మ‌ళ్లీ మొద‌లైంది".. ఉత్కంఠభరితంగా కార్తికేయ 2 ట్రైలర్ !

Updated on Jun 25, 2022 05:14 PM IST
థ్రిల్లర్‌ జోనర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనుపమ్‌ఖేర్ (Anupam Kher) నటిస్తున్నారు
థ్రిల్లర్‌ జోనర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనుపమ్‌ఖేర్ (Anupam Kher) నటిస్తున్నారు

Karthikeya 2 Trailer: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్  ప్రధాన పాత్రలో రాబోతున్న తాజా సినిమా కార్తికేయ 2. దర్శకుడు చందు మొండేటి, నిఖిల్.. వీరిద్దరిదీ  హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'కార్తికేయ'  సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అదే 'కార్తికేయ 2'. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది.  

"శాంత‌ను ఇది నువ్వు ఆప‌లేని యాగం. నేను స‌మిధ‌ను మాత్ర‌మే. ఆజ్యం అక్క‌డ మ‌ళ్లీ మొద‌లైంది.." అనే సంభాష‌ణ‌ల‌తో మొద‌లవుతుంది ట్రైల‌ర్‌.  "అస‌లు కృష్ణుడేంటి..ఈ క‌థ‌ను ఆయ‌నే న‌డిపించ‌డ‌మేంటి.." అనే నిఖిల్ డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. "విశ్వం ఒక పూస‌ల దండ‌.. ప్ర‌తీది నీకు సంబంధ‌మే" అని ఓ పూజారి పాత్రధారితో దర్శకుడు చెప్పించే డైలాగ్.. ఈ చిత్రంపై మరింత ఉత్సుకతను పెంచుతోంది

"స‌స్పెన్స్ ఎలిమెంట్స్‌తో క్యూరియాసిటీని క‌ల‌గ‌జేస్తూ. సినిమాపై అంచ‌నాలు పెంచుతోంది ఈ ట్రైల‌ర్‌. ప్రాణ త్యాగానికి సిద్ధం కాగల తెగింపు ఉన్న యువకుడిగా ఈ చిత్రంలో నిఖిల్ కనిపించారు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పాత్ర కూడా చాలా వెరైటీగా ఉంది. మరి వాళ్ళిద్దరూ ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? అనేది సస్పెన్సులో ఉంచారు.

'అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయన నడిపించడం ఏంటి?' అని నిఖిల్ చెప్పే డైలాగ్ ఆద్యంతం ఆసక్తిని పెంచింది. భక్తి, సైన్స్ నేపథ్యంలో చందూ మొండేటి మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అర్థం అవుతోంది. 

కాగా, థ్రిల్లర్‌ జోనర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనుపమ్‌ఖేర్ నటిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఓ కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2 (Nikhil Siddharth).

ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించినప్పటి నుంచి.. సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్‌ను వదులుతూ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు మేకర్స్ (Chandoo Mondeti). ఇందులో భాగంగానే ఈ చిత్ర ట్రైలర్ 1 ని, హైదరాబాద్ ఏఏంబీ సినిమాస్‌లో ప్రదర్శించడమే కాకుండా అఫీషియల్‌గా విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని ఛాయగ్రహణం అందిస్తుండగా.. కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

Read More: Karthikeya 2 : కార్తికేయ 2 ట్రైలర్‌ రిలీజ్ అప్డేట్ .. నిఖిల్ సిద్ధార్థ్‌ (Nikhil Siddharth) కొత్త ప్రయోగం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!