బాలీవుడ్‌పై కన్నేసిన హీరోయిన్లు సమంత (Samantha), రష్మిక (Rashmika Mandanna).. బ్యూటీల మధ్య పోటీ తప్పదా!

Updated on Jul 29, 2022 06:50 PM IST
టాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్న సమయంలోనే, బాలీవుడ్‌లో కూడా సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు సమంత (Samantha), రష్మిక (Rashmika Mandanna)
టాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్న సమయంలోనే, బాలీవుడ్‌లో కూడా సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు సమంత (Samantha), రష్మిక (Rashmika Mandanna)

సమంత (Samantha).. ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'ఏ మాయ చేశావె' తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. దాదాపు  స్టార్ హీరోలందరి సరసన నటించి తెలుగు వారికి దగ్గరయ్యారు. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఈ జంట మోస్ట్‌ క్రేజీ కపుల్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు.

రష్మికా మందాన (Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు బాగా పాపులర్. 'కిరాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక.. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్‌‌తో బాగా పాపులర్ అయ్యారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీలో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

టాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌లో కూడా సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు సమంత (Samantha-), రష్మిక (Rashmika Mandanna)

హీరోయిన్ల మధ్య కాస్త ఎక్కువగానే..

అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే, సినిమా ఇండస్ట్రీలో కూడా పోటీ ఉంటుంది. ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవాలని అందరిలోనూ కసి ఉంటుంది. నేరుగా ఒకరిపై ఒకరు పోటీ చేయకున్నా, కెరీర్‌‌లో స్టార్‌‌ డమ్‌ సంపాదించుకుని నంబర్ వన్‌ అనిపించుకుంటారు. ఈ పోటీ అందరికీ ఉన్నప్పటికీ.. హీరోయిన్ల మధ్య కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ఉంటే.. పోటీలో ఎవరు గెలుస్తారనే పోలిక ఉంటుంది. రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’లో సమంత (Samantha) స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడారు. 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆ సినిమాలో సమంత ఆడిపాడిన ‘ఊ అంటావా’ స్పెషల్ సాంగ్ అంతకంటే పెద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

నార్త్‌పై ఫోకస్..

ప్రస్తుతం రష్మిక – సమంతల మధ్య గట్టి పోటీ నెలకొంది. తెలుగులో టాప్‌ ప్లేస్‌లో ఉన్న వీరిద్దరూ, ప్రస్తుతం నార్త్‌ సినిమాలపై ఫోకస్ పెట్టారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు. తెలుగులో ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య ఎప్పుడూ పోటీ రాలేదు. దీనికి కారణం తెలుగులో రష్మిక వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో.. సమంత పెళ్లి చేసుకుని సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నారు. అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాలతో మరోసారి బిజీ అయ్యారు. 

పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌తో రష్మికా మందాన (Rashmika Mandanna) ఒకేసారి.. మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ వంటి భారీ సినిమా ఆఫర్లు పట్టేశారు. సమంత (Samantha) కూడా ఒకేసారి మూడు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య తెలుగులో లేని పోటీ హిందీలో తప్పేలా లేదనే చర్చ జరుగుతోంది.

Read More : మరో ఐటం సాంగ్‌లో టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha).. ఈసారి బాలీవుడ్‌లో చాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!