గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో రామ్‌ పోతినేని (Ram Pothineni) సినిమా.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Updated on Sep 15, 2022 09:27 PM IST
రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన ది వారియర్‌‌ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది
రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన ది వారియర్‌‌ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ఇటీవలే ది వారియర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్‌లో పేరు తెచ్చిపెట్టలేదు. బాక్సాఫీస్‌ దగ్గర ది వారియర్ సినిమా బోల్తా పడింది. దీంతో తన తర్వాత సినిమా ఎవరితో చెయ్యాలనే దానిపై రామ్‌ కొన్నాళ్లుగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

రామ్‌ పోతినేని తన తర్వాతి సినిమాను లవ్‌ ఎంటర్‌‌టైనర్లను తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్‌ అయిన గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. చాలాకాలం నుంచి  హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రామ్‌కు.. పూరీ జగన్నాథ్​ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌‌ మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రామ్ చేసిన సినిమాలు రెడ్‌, ది వారియర్‌‌ హిట్ కాలేదు. దీంతో మరోసారి రామ్‌ తన కెరీర్‌‌ను గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే లవ్‌ ఎంటర్‌‌టైనర్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.

రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన ది వారియర్‌‌ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది

నటుడిగానూ రాణిస్తున్న గౌతమ్‌..

ఇక, ఘర్షణ వంటి యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌లో లవ్‌ సీన్లను మిక్స్‌ చేసి ప్రేక్షకులను మెప్పించి, ఏ మాయ చేశావే అనే సినిమాతో యూత్‌కు దగ్గరైన  దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్. దర్శకత్వంతోనే కాదు యాక్టర్‌‌గా కూడా నిరూపించుకున్న గౌతమ్‌ ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

గౌతమ్‌ దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన సినిమా ‘తాందు వెనిందాతు కాదు’. ఈ సినిమాను తెలుగులో ‘నా పేరు ముత్తు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌‌ 17వ తేదీన నా పేరు ముత్తు సినిమా విడులవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లను జోరుగా నిర్విహిస్తోంది చిత్ర యూనిట్. ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌.

త‌న తర్వాత సినిమాను హీరో రామ్‌ (Ram Pothineni)తో చేయ‌బోతున్నట్లు ప్రకటించారు. వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్​లనుందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మొదలైతే తెలుగులో గౌతమ్‌ మీనన్‌కు 5వ సినిమా అవుతుంది. ఈ సినిమాతో పాటు చియాన్ విక్రమ్‌తో ‘ధృవ న‌క్షత్రం’ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చారు. మ‌రో మూడు, నాలుగు నెలల్లో ఈ సినిమా విడుద‌ల చేయనున్నట్టు వెల్లడించారు. ఇటీవ‌లే ‘సీతారామం’ సినిమాలో మేజ‌ర్ సెల్వన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.

Read More : రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!