రాజమౌళి (rajamouli ss) సత్తా ఏంటో ఆ ఒక్క సినిమాతో అర్థమైంది: సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ (A.R.Rahman)

Updated on Oct 19, 2022 12:21 PM IST
రాజమౌళి (rajamouli ss) తీసిన  ‘బాహుబలి’ (Baahubali) చూసి ఆశ్చర్యపోయానని రెహ్మాన్ (A.R.Rahman) అన్నారు
రాజమౌళి (rajamouli ss) తీసిన ‘బాహుబలి’ (Baahubali) చూసి ఆశ్చర్యపోయానని రెహ్మాన్ (A.R.Rahman) అన్నారు

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (rajamouli ss) గురించి తెలియని భారతీయు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ మాటకొస్తే ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie)తో జక్కన్న దర్వకత్వ ప్రతిభ ఏంటో విదేశీ ఆడియెన్స్‌కు కూడా తెలిసొచ్చింది. అందుకే ఆయన తీసిన గత చిత్రాలేంటో, అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయో వెతికి మరీ చూస్తున్నారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చూసి ఫిదా అవుతున్న ఫారెన్ ఆడియెన్స్.. ఆయన గత చిత్రాలు ‘ఈగ’, ‘బాహుబలి’ సిరీస్‌ను ఓటీటీల్లో చూసి.. వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీన్ని బట్టి జక్కన్న ఇమేజ్ ఖండాంతరాలు దాటిందని చెప్పుకోవచ్చు. 

రాజమౌళిని ఇండస్ట్రీలకు సంబంధం లేకుండా సినీ ప్రముఖులు పొగుడుతూనే ఉంటారు. ఆయన చిత్రాలను రూపొందించే తీరు, పని విషయంలో చూపించే నిబద్ధత తమను ఆశ్చర్యపరుస్తుందని పలువురు సెలబ్రిటీలు అనడం చూశాం. అలాంటి జక్కన్న గురించి ఆస్కార్ విజేత, భారతదేశం గర్వించే సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ (A.R.Rahman) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహ్మాన్ మాట్లాడుతూ.. ‘మగధీర సినిమా చూసినప్పుడే రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఆయన తీసిన ‘బాహుబలి’ చూసి ఆశ్చర్యపోయా. రాజమౌళి తన చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు’ అని రెహ్మాన్ మెచ్చుకున్నారు. 

ఇకపోతే, ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ గురించి కూడా రెహ్మాన్ స్పందించారు. ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్ సే’ చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలేనని ఈ సంగీత దిగ్గజం చెప్పారు. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ గురించి కూడా రెహ్మాన్ మాట్లాడారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు.  

కాగా, ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) చిత్రం సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఇంతకుముందు ఉన్న చాలా రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. తమిళ టాప్–3 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచి.. దర్శకదిగ్గజం మణిరత్నం సినిమాల్లో మర్చిపోలేని హిట్‌గా రికార్డును క్రియేట్ చేసింది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ‘పీఎస్ 1’ రూ.475 కోట్ల మార్కును అందుకునే దిశగా దూసుకెళ్తోంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ మూవీ సీక్వెల్‌ను మరింత మెరుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మణిరత్నం ప్రయత్నిస్తున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. మరి, ఆ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

Read more: రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా మహేష్ బాబు (Mahesh Babu)-రాజమౌళి ప్రాజెక్ట్.. విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!