Telugu Indian Idol : ఒకే రియాలిటీ షోలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. ఇది ఎలా సాధ్యమైంది?

Updated on Jun 07, 2022 01:10 PM IST
రియాలిటీ షోలకు ముఖ్య అతిథిగా చిరంజీవి (Chiranjeevi) హాజరవ్వడం అనేది ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన బిగ్ బాస్ 3, 4 సీజన్లకు కూడా అతిథిగా హాజరై, ప్రేక్షకులను అలరించారు.
రియాలిటీ షోలకు ముఖ్య అతిథిగా చిరంజీవి (Chiranjeevi) హాజరవ్వడం అనేది ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన బిగ్ బాస్ 3, 4 సీజన్లకు కూడా అతిథిగా హాజరై, ప్రేక్షకులను అలరించారు.

Telugu Indian Idol : 'తెలుగు ఇండియన్ ఐడల్' షో ఇక ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ  షో గ్రాండ్ ఫినాలేకి సిద్ధమవుతోంది. ఈ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారనే సంగతి తెలిసిందే. 

తాజా వార్తల ప్రకారం జూన్ 7 వ తేది అనగా, ఈ రోజే ఈ ఫినాలే షూటింగ్ జరగనుంది. నిజానికి, ఈ షూటింగ్ నిన్నే పూర్తి కావాల్సి ఉంది. అయితే, చిరంజీవి బిజీ షెడ్యూల్స్ వల్ల, ఈ రోజుకి అది పోస్ట్ పోన్ అయ్యింది. 

రియాలిటీ షోలు మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు 

రియాలిటీ షోలకు ముఖ్య అతిథిగా చిరంజీవి (Chiranjeevi) హాజరవ్వడం అనేది ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన బిగ్ బాస్ 3, 4 సీజన్లకు కూడా అతిథిగా హాజరై, ప్రేక్షకులను అలరించారు. అలాగే సమంత వ్యాఖ్యాతగా నిర్వహించిన 'సామ్ జామ్' షోలో కూడా పాల్గొని, ఆమెకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు చిరు. 

ఇక, ప్రస్తుతం 'తెలుగు ఇండియన్ ఐడల్'కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, సెమీ ఫైనల్ ఎపిసోడ్‌కు నిర్వాహకులు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను ముఖ్య అతిథిగా పిలిచారు. జూన్ 10 తేదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా, ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

తాజాగా విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో పాల్గొన్న బాలయ్య కూడా చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ.. కంటెస్టంట్స్‌‌లో ఉత్తేజాన్ని నింపడం విశేషం. 

ఆహాలో 'అన్ స్టాపబుల్' అంటూ దూసుకుపోయిన బాలయ్య

ఇక ఒక షో సెమీ ఫైనల్ ఎపిసోడ్‌లో బాలయ్య పాల్గొనగా.. అదే షో గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi) హాజరవ్వడం అనేది చాలా అరుదైన అంశమని నెటిజన్లు అంటున్నారు. ఒక రకంగా చూస్తే, ఇండస్ట్రీలో ఇదో పాజిటివ్ పరిణామం అను చెప్పుకోవచ్చు. ఇక, వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై ఇంటర్వ్యూ ఇస్తే, ఆ కథే వేరుగా ఉంటుందని కూడా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) షోకి సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన హిందీ ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత కూడా. ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్‌కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటి నిత్యా మేనన్, గాయకుడు కార్తిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 

Read More : తెలుగు ఇండియన్ ఐడల్ లో అలిగిన గెస్ట్ ఉషా ఉతుప్.. క్షమాపణ చెప్పిన శ్రీరామచంద్ర


 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!