Jayasudha: పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లు పనికిరారా..? సినీ ఇండస్ట్రీపై జయసుధ ఘాటు వ్యాఖ్యలు!

Updated on Jul 30, 2022 05:50 PM IST
తాజాగా జయసుధ 'ఓపెన్‌ విత్‌ ఆర్కే' (Open Heart with RK) టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు.
తాజాగా జయసుధ 'ఓపెన్‌ విత్‌ ఆర్కే' (Open Heart with RK) టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు.

Jayasudha: సినీ పరిశ్ర‌మలోకి 14ఏళ్ల వ‌యసులోనే ఎంట్రీ ఇచ్చి, త‌న స‌హజ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అలనాటి స్టార్‌ హీరోయిన్‌ జ‌య‌సుధ‌. ఈ మధ్యకాలంలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ల వివక్షపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. దర్శక నిర్మాతలు ముంబయి నుంచి వచ్చే హీరోయిన్లకు ఎక్కుగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారని.. తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని అన్నారు. ఈ సందర్బంగా పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లయిన మేము పనికిరామా? అంటూ ప్రశ్నించారు. ముంబయి నుంచి హీరోయిన్ వస్తే ఆమె పెంపుడు కుక్కలకు కూడా నిర్మాతలు స్పెషల్ రూములు ఇస్తున్నారని విమర్శించారు. 

తాజాగా జయసుధ 'ఓపెన్‌ విత్‌ ఆర్కే' (Open Heart with RK) టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె.. త‌న 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశాన‌ని చెప్పింది. జయసుధ తన కెరీర్ లో.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు వంటి మొదటితరం హీరోలతో కలిసి నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. 

1972లో వ‌చ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన జయసుధ (Jayasudha) అన‌తి కాలంలోనే అప్ప‌టి అగ్ర క‌థానాయ‌కుల‌తో జోడీ క‌ట్టి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. సుమారు ఐదు ద‌శాబ్ధాల పాటు న‌టిగా ఎన్నో వైవిధ్యభ‌రిత పాత్ర‌లు పోషించి సినీ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకుంది. 

ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జయసుధ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్టార్‌ హీరోయిన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా హీరోలతో పోల్చితే హీరోయిన్లపై వివక్ష ఉందన్నారు. ఇటీవల కంగనా రనౌత్‌కి (Kangana Ranaut) 'పద్మశ్రీ' పురస్కారం ఇచ్చిన నేపథ్యంలో ఆమెతో ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో అంటూ సంచలనాలకు తెరలేపారు. 

ఎప్పుడైనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారు కాదని జయసుధ తెలిపారు. అయితే.. హీరోల్లో డామినేషన్ ఉండదని, వారి పక్కన ఉన్న వాళ్లతోనే ఇబ్బంది అని చెప్పారు. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని.. ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్ లో (Bollywood) అయితే కనీసం ఫ్లవర్ బొకే అయినా పంపించేవారని.. కానీ, ఇక్కడ అది కూడా లేదని విమర్శించారు. అదే హీరో అయితే ఎక్కడా లేని హడావుడి చేసేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read More: 'రష్మిక నా డార్లింగ్‌ అంటున్న విజయ్'.. అసలు విషయం బయటపెట్టిన అనన్య పాండే(Ananya Pandey)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!