Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజలతో మల్టీ స్టారర్ సినిమా.. వచ్చే నెల నుండి షూటింగ్ మొదలవుతుందా ?

Updated on Jun 11, 2022 03:40 PM IST
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి తేజ్‌లతో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారట. 
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి తేజ్‌లతో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారట. 

వినోదయ సితం.. తమిళంలో ఈ చిత్రానికి మంచి సమీక్షలు వచ్చాయి. అలాగే ఇదే చిత్రం తమిళనాడులో బహుళ ప్రజాదరణ కూడా పొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి తేజ్‌లతో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారట. 

అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ కార్యకలాపాలతో పాటు, హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పనులతో బిజీగా ఉండడం వల్ల.. వినోదయ సితం రీమేక్ పనిని వాయిదా వేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ నిర్ణయాన్ని పవన్ వెనక్కి తీసుకున్నారని.. అన్నీ కుదిరితే, వచ్చే నెల నుండే సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సితం' రీమేక్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందనేది ఇండస్ట్రీ టాక్. 

చాలా వెరైటీ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 

ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  వచ్చే నెల నుండి షూటింగ్‌కు ప్రణాళికలను సిద్ధం చేస్తుందనేది సమాచారం. ఒరిజినల్ సినిమాతో పోలిస్తే, ఈ రీమేక్ చిత్రంలో స్క్రిప్ట్ మార్పులు ఉండబోతున్నాయని.. అలాగే సినిమా రన్ టైంలో కూడా తేడా ఉంటుందని సమాచారం. 

సాయి తేజ్ సరసన హీరోయిన్ ఎవరు?

ఈ సినిమాలో సాయి తేజ్ (Sai Tej) సరసన తొలుత క్రితి శెట్టిని కథానాయికగా తీసుకుంటారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కేతికా శర్మ, 'పెళ్లిసందడి' హీరోయిన్ శ్రీ లీలలను కూడా సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. 

బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకు మాటలను అందిస్తున్నారట. తమిళంలో తంబి రామయ్య పోషించిన పాత్రను తెలుగులో సాయితేజ్ (Sai Tej) పోషించగా.. కథకు చాలా కీలకమైన సముద్రఖని పాత్రను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేయనున్నారట. 

Read More : పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!