Rashmika Mandanna: పరశురామ్ దర్శకత్వంలో హీరోగా నాగచైతన్య (Naga chaitanya).. హీరోయిన్‌గా రష్మిక మందన్నా!

Updated on Aug 10, 2022 06:02 PM IST
అక్కినేని నాగచైతన్య(AkkineniNagachaitanya) హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది.
అక్కినేని నాగచైతన్య(AkkineniNagachaitanya) హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవలే అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' (Pushpa) సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాందించుకుంది రష్మిక.

ఇక, 'పుష్ప ది రూల్' చిత్రం త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో.. ఆమె మళ్లీ తెలుగులో వరుస సినిమాలు ఒప్పుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.  

కాగా.. బాలీవుడ్, కోలీవుడ్‌లలో పలు చిత్రాలలో హీరోయిన్‌గా చేస్తున్న రష్మికకు.. తెలుగులో 'పుష్ప' సినిమా కాకుండా మరే సినిమా కూడా లేదని చెప్పాలి. ఈ క్రమంలో ఆమెకు తాజాగా ఓ సినిమా అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రష్మిక మందన్నా (Rashmika Mandanna)

నాగచైతన్య ఇటీవలే 'లవ్‌స్టోరీ' (Love story), 'బంగార్రాజు' లాంటి సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు. అయితే.. ‘థ్యాంక్యూ’ (Thank you) సినిమాతో మాత్రం డీలా పడ్డాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఇప్పుడు ఈ స్టార్.. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక, ఈ మూవీ రిలీజ్ కాకముందే చైతూ తర్వాతి ప్రాజెక్టు అప్‌డేట్ రావడం గమనార్హం.

నాగచైతన్య ఇటీవలే పరశురామ్ (Director Parasuram) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.  పరశురామ్ ఓ కథను వినిపించగా దానికి ఫుల్ ఫిదా అయిపోయిన నాగచైతన్య, త్వరలోనే ఆ చిత్రాన్ని ప్రారంభించాలని తెలిపాడట.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి నటీనటులను ఎంపిక చేసే క్రమంలో, హీరోయిన్‌గా రష్మిక అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించిందట. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

డైరెక్టర్ పరశురామ్ ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh babu) ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద హిట్ అందుకున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మహేష్ బాబుని చాలా అందంగా చూపించడంతో పాటు… సినిమాని సరికొత్తగా తెరకెక్కించడంతో పరశురామ్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది.

కాగా, రష్మిక మందాన కూడా, ఇంతకుముందు పరశురామ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీతగోవిందం' సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. 

Read More: Rashmika Mandanna: "కథ విని భయపడిపోయి.. నో చెప్పాను"... 'సీతారామం' ప్రమోషన్లలో రష్మిక మందన్న(Rashmika)!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!