Chiranjeevi: గోపీచంద్ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా చిరంజీవి !

Updated on Jun 23, 2022 09:26 PM IST
మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, రాశీ ఖన్నా
మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, రాశీ ఖన్నా

గోపీచంద్ (Gopichand), రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు.

జూలై 1న పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచింది చిత్ర యూనిట్.

అందులో భాగంగానే పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు, ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 తేదిన హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమానికి స్టార్ హీరో చీఫ్‌ గెస్ట్‌గా రానున్నారని ఇండస్ట్రీ టాక్. 'పక్కా కమర్షియల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని తెలుస్తోంది.

మంచి రెస్పాన్స్..

'పక్కా కమర్షియల్' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్‌ ఉన్న సినిమా చేశానని గోపీచంద్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘పక్కా కమర్షియల్‌’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్‌ ఉందని, రాసిన కథకు దర్శకుడు మారుతి న్యాయం చేశారనే అనుకుంటున్నానని కూడా అన్నాడు గోపీచంద్ (Gopichand).

హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఈ సినిమా తనకెంతో స్పెషల్‌ అని చెబుతోంది. ‘ప్రతిరోజూ పండుగే’ చిత్రంలో చేసిన ఏంజెల్‌ ఆర్నా అనే క్యారెక్టర్‌‌‌ను మించి, పక్కా కమర్షియల్ సినిమాలోని పాత్ర వినోదాన్ని పంచుతుందని స్పష్టంగా చెబుతోంది రాశీ ఖన్నా.

Read More : గోపీచంద్‌ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా నుంచి అందాల రాశి ఫుల్‌ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!
anonymous user
Jun 23, 2022 07:21 PM
nice article