SS Rajamouli: మహేష్ బాబు సినిమాపై రాజమౌళి ఇచ్చిన హింట్ ఏంటో తెలుసా!

Updated on Nov 20, 2022 12:10 PM IST
 అడ్వెంచర్ థ్రిల్లర్ కథను చిత్రీకరించాలనే తన కల.. మహేష్ సినిమాతో నెరవేరుతుందన్నారు రాజమౌళి (SS Rajamouli).
అడ్వెంచర్ థ్రిల్లర్ కథను చిత్రీకరించాలనే తన కల.. మహేష్ సినిమాతో నెరవేరుతుందన్నారు రాజమౌళి (SS Rajamouli).

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ ఇండియా లెవల్‌లో సినిమా తీస్తున్నారు. మహేష్ బాబుతో తాను చిత్రీకరించే సినిమాపై రాజమౌళి చిన్న హింట్ ఇచ్చారు. హింట్ చిన్నదే.. కానీ అందులో విషయం మాత్రం ప్రపంచ సినిమా రంగంలో ఓ వండర్‌గా రాజమౌళి సినిమా ఉంటుందని అర్థమవుతుంది. ఇంతకి రాజమౌళి SSMB29 సినిమా గురించి ఏం చెప్పారో తెలుసా..

పాన్ ఇండియా సినిమాలో మహేష్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu) తన 29వ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, మహేష్ కాంబోలో SSMB29 యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. రాజమౌళి ఈ సినిమాపై రీసెంట్‌గా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

SS Rajamouli: రాజమౌళి

అడ్వెంచర్ సినిమా నా కల - రాజమౌళి

రాజమౌళి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ కథలు ఓ వండర్ అని అందరికీ తెలిసిన విషయమే. మహేష్ సినిమా SSMB29 కు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్‌, తన కజిన్స్‌తో కలిసి SSMB29 కథను రెడీ చేస్తున్నానని రాజమౌళి తెలిపారు. ఈ సినిమా కథ ప్రారంభంలోనే ఉందన్నారు. అంతేకాదు ఈ స్టోరిని రివీల్ చేయలేనని కూడా చెప్పారు. 

తాను ఎప్పటి నుంచో అడ్వెంచర్ థ్రిల్లర్ కథను చిత్రీకరించాలని భావిస్తున్నానని.. మహేష్ సినిమాతో తన డ్రీమ్ నెరవేరుతుందన్నారు రాజమౌళి. మహేష్ బాబు సినిమాకు ఎక్కువ సమయం తీసుకోనని చెప్పారు. ఇండియానా జోన్స్‌లో తన సినిమా ఉండబోతుందని తన కొత్త ప్రాజెక్ట్ గురించిన ఆసక్తికర విశేషాలను  రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Read More : RRR : "ఆర్ఆర్ఆర్" కొత్త రికార్డు - జపాన్ దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన రాజమౌళి సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!