Karthikeya 2 : 'కార్తికేయ 2' క‌లెక్ష‌న్ అన్ని కోట్లా!... నిఖిల్ సినిమా ఎన్ని స్క్రీన్ల‌లో ఆడుతుందో తెలుసా!

Updated on Sep 10, 2022 05:47 PM IST
Karthikeya 2: నిఖిల్ సిద్ధార్థ న‌టించిన 'కార్తికేయ 2' ఆగ‌స్టు 12న రిలీజ్ అయింది. ఈ సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.
Karthikeya 2: నిఖిల్ సిద్ధార్థ న‌టించిన 'కార్తికేయ 2' ఆగ‌స్టు 12న రిలీజ్ అయింది. ఈ సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

Karthikeya 2:టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) సినిమా 'కార్తికేయ 2' కాసుల సునామీ సృష్టిస్తోంది. వంద కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసిన చిత్రంగా మ‌రో రికార్డును బ్రేక్ చేయ‌నుంది. ఈ సినిమా ఇండియాతో పాటు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. బాలీవుడ్‌లో 'బాహుబ‌లి', 'పుష్ప' సినిమాల త‌రువాతి స్థానంలో 'కార్తికేయ 2' నిలిచింది. 'కార్తికేయ 2' సినిమా నార్త్ ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డం మ‌రో విశేషం. ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు వ‌సూళ్లు చేసిన వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

పైసా వ‌సూళ్లు

ప‌లు వాయిదాల త‌రువాత హీరో నిఖిల్ సిద్ధార్థ న‌టించిన సినిమా 'కార్తికేయ 2' ఆగ‌స్టు 12న రిలీజ్ అయింది. ఈ సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కించిన 'కార్తికేయ 2' ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు రూ.120 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 కు పైగా స్క్రీన్ల‌లో 'కార్తికేయ 2' సినిమా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన 'కార్తికేయ 2' క‌లెక్ష‌న్ల ప‌రంగా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రోజు రోజుకు ఈ సినిమా వ‌సూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. 'కార్తికేయ 2' క‌లెక్ష‌న్ ఇలాగే కొన‌సాగితే.. ముందు ముందు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతుంద‌ని క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

30 రోజులు పూర్తి

'కార్తికేయ 2' (Karthikeya 2)  చిత్రం ఇటీవలే 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. అడ్వెంచర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించారు. 

ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' స‌క్సెస్ సంబురాలు... గ‌ర్వంగా ఉందన్న హీరో నిఖిల్(Nikhil Siddhartha)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!