Goodachari 2: 'గూఢ‌చారి 2' పై ఫోక‌స్ చేసిన‌ అడ‌వి శేష్ (Adivi Sesh)!.. పాన్ ఇండియా లెవెల్‌లో 'గూఢ‌చారి 2'.

Updated on Jul 20, 2022 10:34 AM IST
అడ‌వి శేష్  (Adivi Sesh) న‌టించాల‌నుకుంటున్న మ‌రో సినిమా 'గూఢ‌చారి 2'. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారు.
అడ‌వి శేష్  (Adivi Sesh) న‌టించాల‌నుకుంటున్న మ‌రో సినిమా 'గూఢ‌చారి 2'. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారు.

టాలీవుడ్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) 'మేజ‌ర్' చిత్రంతో  భారీ విజ‌యాన్ని అందుకున్నారు. 'మేజ‌ర్' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించ‌డంతో అడ‌వి శేష్ మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. గ‌తంలో అడ‌వి శేష్ న‌టించిన 'గూఢ‌చారి' సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అందించింది.ఈ సినిమాకు సీక్వెల్‌గా 'గూఢ‌చారి 2'ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే 'గూఢ‌చారి 2' సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించాల‌ని భావిస్తున్నారు.

విడుద‌ల‌కు సిద్ధంగా 'హిట్2'
ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. టాప్ హీరోల‌తో పాటు చాలా మంది యువ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టారు. అడ‌వి శేష్ 'మేజ‌ర్' చిత్రంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అడవి శేష్ న‌టించిన 'హిట్ 2' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 'హిట్ 2' సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్‌గా శైలేష్‌ కొలను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా న‌టించారు.

అడ‌వి శేష్  (Adivi Sesh) న‌టించాల‌నుకుంటున్న మ‌రో సినిమా 'గూఢ‌చారి 2'. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాగా 'గూఢ‌చారి 2'
అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టించాల‌నుకుంటున్న మ‌రో సినిమా 'గూఢ‌చారి 2'. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారు. స్పై ఆపరేషన్‌ నేపథ్యంలో నిర్మించ‌నున్నారు. అడివి శేష్ హీరోగా 2018 లో వచ్చిన 'గూఢచారి' భారీ విజయాన్ని నమోదు చేసింది. 'గూఢ‌చారి' చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శ‌శికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో  'గూఢ‌చారి 2' కూడా తెర‌కెక్కుతుంది.

2020లోనే 'గూఢ‌చారి 2' నిర్మిస్తున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా చేశారు. కానీ 'మేజ‌ర్' సినిమా కార‌ణంగా ఆ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టారు. ఇక‌ 'మేజ‌ర్' స‌క్సెస్‌తో అడ‌వి శేష్, శ‌శికిర‌ణ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. వీరిద్ద‌రు 'గూఢ‌చారి 2'పై మ‌రింత ఫోక‌స్ చేశారు. 

'క్షణం', 'గూఢచారి', 'మేజర్' వంటి సినిమాల‌తో అడ‌వి శేష్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయారు. ఇలాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదాన్ని అందించాల‌ని అడ‌వి శేష్ భావిస్తున్నారు. కొత్త క‌థ‌ల‌తో య‌వ‌త‌కు మెసేజ్ ఇచ్చే సినిమాల‌తో అడ‌వి శేష్  (Adivi Sesh) త‌న న‌ట విశ్వ రూపం చూప‌నున్నారు. 

Read More: 'MAJOR' REVIEW (మేజర్ రివ్యూ): దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌ని, వారిని కాపాడ‌టం సోల్జ‌ర్ ప‌ని : అడివి శేష్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!