Rashmika Mandanna: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న రష్మిక మందన్న మూవీ!.. అప్పటినుంచే స్ట్రీమింగ్..? 

Updated on Nov 17, 2022 07:26 PM IST
‘గుడ్ బై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో.. ‘మిషన్ మజ్ను’ (Mission Majnu) మీద రష్మిక (Rashmika Mandanna) ఆశలు పెట్టుకున్నారు
‘గుడ్ బై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో.. ‘మిషన్ మజ్ను’ (Mission Majnu) మీద రష్మిక (Rashmika Mandanna) ఆశలు పెట్టుకున్నారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna)కు రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘భీష్మ’, ‘పుష్ప’ లాంటి చిత్రాలతో తెలుగు నాట స్టార్ హీరోయిన్‌గా మారిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నటించిన ‘పుష్ప’ మూవీతో ఆమె ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించారు. ఆ క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు నేరుగా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. 

కరోనాతో వాయిదా పడుతూ..
‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రష్మికా మందన్న. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆమె హిందీలో యాక్ట్ చేసిన మరో సినిమా ‘మిషన్ మజ్ను’ (Mission Majnu). ఈ మూవీలో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మిక జతకట్టారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అనంతరం బాక్సాఫీస్ వద్ద బడా హీరోల మూవీస్, భారీ చిత్రాలు విడుదలవ్వడంతో మూవీ టీమ్ వాయిదా వేస్తూ వచ్చింది. 

‘మిషన్ మజ్ను’ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది

రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్?
‘మిషన్ మజ్ను’ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అంతేకాదు చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ చేయలేదు. అయితే ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజా బజ్ ప్రకారం.. ‘మిషన్ మజ్ను’ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందట. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. 

ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టేనా..!
వచ్చే ఏడాది జనవరి నుంచి ‘మిషన్ మజ్ను’ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. దీనిపై త్వరలోనే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందట. కాగా, బాలీవుడ్‌లో రష్మిక ఒప్పుకున్న తొలి ప్రాజెక్టు ఇదే. అయితే ఆమె రెండో చిత్రం ‘గుడ్ బై’ తొలుత రిలీజై.. ఫ్లాప్‌గా నిలిచింది. ఇకపోతే, ‘మిషన్ మజ్ను’ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. దీనికి శాంతను బాగ్చీ దర్శకత్వం వహించారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఓ కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి, ఈ మూవీతోనైనా రష్మిక హిందీలో తన స్థానాన్ని పదిలపర్చుకుంటారేమో చూడాలి. 

Read more: ఫోన్ల మార్పుతో తారుమారైన జీవితాలు.. ఆసక్తికరంగా ‘లవ్ టుడే’ (Love Today) సినిమా ట్రైలర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!