SSMB 28: మహేష్‌తో హ్యాట్రిక్‌ కొట్టడానికి.. త్రివిక్రమ్‌ ఏం ప్లాన్ చేశారు?

Updated on May 22, 2022 07:08 PM IST
SSMB28: మ‌హేష్ 28 సినిమా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ హిట్ సాధించేలా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.
SSMB28: మ‌హేష్ 28 సినిమా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ హిట్ సాధించేలా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

SSMB28: 'స‌ర్కారు వారి పాట' సినిమాతో మ‌హేష్ బాబు (Mahesh Babu) బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించారు. ఇక మ‌హేష్ త‌న తదుపరి సినిమాను, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషనులో వ‌చ్చే మూడో సినిమా అప్‌డేట్స్ ఆస‌క్తిగా మారాయి.

టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడిగా పేరున్న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram) కాంబోలో వ‌చ్చిన మొద‌టి సినిమా 'అత‌డు'. ప్రిన్స్ న‌టించిన 'అత‌డు' సినిమా సూప‌ర్ హిట్ అయింది. అంతేకాదు, ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్‌కు, ఈ చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందించింది.  

ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా 'ఖ‌లేజా'. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఓ మోస్తరు స్థాయిలో మెప్పించింది. ఇప్పుడు మ‌హేష్ 28 వ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో.. హ్యాట్రిక్ హిట్ సాధించేలా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 

SSMB28: త్రివిక్ర‌మ్ ఏ స్టార్‌కు ప్రిన్స్ సినిమాలో చాన్స్ క‌ల్పిస్తారో!

'స‌ర్కారు వారి పాట' మ‌హేష్ బాబు న‌టించిన 27వ సినిమా. కాగా, మ‌హేష్ త‌న 28వ సినిమాను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తోనూ, 29వ చిత్రాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళితో చేయ‌నున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) సినిమాపై ఓ అప్‌డేట్ అభిమానులకు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మే 31న మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజున,  ఎస్ఎస్ఎంబీ 28 పై  ఓ కొత్త అప్‌డేట్ ఇస్తార‌ట‌. అలాగే, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేస్తార‌ని టాక్. 

SSMB28: త్రివిక్ర‌మ్ ఏ స్టార్‌కు ప్రిన్స్ సినిమాలో చాన్స్ క‌ల్పిస్తారో!

ఇక త్రివిక్ర‌మ్ తను మహేష్ బాబుతో తీస్తున్న సినిమాలో, మ‌రో హీరోకు కూడా కీల‌క పాత్ర‌ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 'అలా వైకుంఠ‌పురంలో' సినిమాలో ఆయన సుశాంత్‌ను స్పెష‌ల్ రోల్‌లో చూపించిన సంగతి తెలిసిందే. కాగా, సోష‌ల్ మీడియాలో మ‌హేష్ 28 వ సినిమాలో నాని న‌టిస్తున్నారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కనుక,  త్రివిక్ర‌మ్ ఏ స్టార్‌కు తన సినిమాలో ఛాన్స్ క‌ల్పిస్తారో వేచి చూడాలి. కొందరు మహేశ్ అభిమానులు మాత్రం హీరో విజయ్ దేవరకొండ లేదా అడివి శేష్‌ను.. త్రివిక్ర‌మ్ త‌న సినిమాలో తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. 

మహేశ్ బాబు 28వ (SSMB 28) చిత్రాన్ని హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించనున్నారు. మ‌హేష్‌కు జోడిగా పూజ హెగ్డే ఈ సినిమాలో న‌టిస్తున్నారు. సంగీతాన్ని త‌మ‌న్ అందిస్తున్నారు. అలాగే ప్రిన్స్ 28వ సినిమాకు 'పార్థు' అనే టైటిల్ ఖ‌రారు చేయాల‌నుకుంటున్నారు. 2022 జూలైలో మ‌హేష్, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తున్న సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ట‌. త్రివిక్రమ్ ఈ సినిమాకు ఓ బలమైన కథను సిద్ధం చేశారు.  అలాగే పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమాని దీనిని మలిచి,  మంచి హిట్ కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!