యాక్టర్‌‌ కాకపోతే న్యూస్ యాంకర్‌ అయ్యేదానిని.. చిట్‌చాట్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Paayal Rajput)

Updated on Aug 19, 2022 11:28 PM IST
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన తీస్‌ మార్ ఖాన్ సినిమా రిలీజ్ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput)  అభిమానులతో ముచ్చటించారు.
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన తీస్‌ మార్ ఖాన్ సినిమా రిలీజ్ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput) అభిమానులతో ముచ్చటించారు.

ఆర్ఎక్స్ 100 సినిమాతో అదిరిపోయే స‌క్సెస్ అందుకున్నారు హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ (Paayal Rajput).  ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు అందుకున్నారు పాయ‌ల్.  విక్టరీ వెంకటేష్‌తో వెంకీ మామ‌, ర‌వితేజ‌తో డిస్కో రాజా సినిమాల్లో మెరిశారు ఈ పంజాబీ బ్యూటీ.

ప్రసుతం పాయల్.. ఆదిసాయికుమార్‌తో క‌లిసి తీస్ మార్ ఖాన్  సినిమాలో న‌టించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా ట్విట‌ర్‌‌లో అభిమానులతో పాయల్ చిట్‌చాట్‌ చేశారు. 

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన తీస్‌ మార్ ఖాన్ సినిమా రిలీజ్ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput)  అభిమానులతో ముచ్చటించారు.

ఒక‌వేళ మీరు న‌టి కాక‌పోయి ఉంటే ఏం చేసేవారు అని ఓ అభిమాని పాయ‌ల్‌ను అడిగారు. దీనికి పాయ‌ల్ రాజ్‌పుత్ స్పందిస్తూ.. తాను జ‌ర్నలిజం చేసిన‌ట్టే.. న్యూస్ యాంక‌ర్ కూడా అయ్యేదాన్ని అని రిప్లై ఇచ్చా. కాగా  మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న జిన్నా చిత్రంలో  ఒక హీరోయిన్‌గా న‌టిస్తున్నారు పాయల్.

దీంతోపాటు కిరాత‌క‌, హెడ్ బుష్ చిత్రాల్లో న‌టిస్తున్నారు పాయల్ రాజ్‌పుత్. ఎలాగైనా బిగ్ బ్రేక్ అందుకోవాలని ఎదురుచూస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌ (Paayal Rajput) మంచి స‌క్సెస్ అందుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు ఆమె ఫాలోవ‌ర్లు, అభిమానులు.

Read More : మంచు విష్ణుని (Vishnu Manchu) బాదేసిన సన్నీలీయోన్, పాయల్‌ రాజ్‌పుత్.. గుణపాఠం చెప్పామని వీడియో పోస్ట్‌ చేసిన సన్నీలియోన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!