విజయ్ (Vijay), లోకేష్‌ కనగరాజ్‌ కాంబో రిపీట్: 'మాస్టర్‌‌' రేంజ్‌ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ !

Updated on May 24, 2022 10:28 AM IST
దర్శకుడు లోకేష్‌తో దళపతి విజయ్
దర్శకుడు లోకేష్‌తో దళపతి విజయ్

ఇండ‌స్ట్రీలో ఒక సినిమా హిట్‌ అయితే చాలు !  ఆ హీరో, ద‌ర్శకుడి కాంబినేషన్‌లో మ‌రో సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా?  అని ప్రేక్షకులు, అభిమానులూ ఎదురుచూస్తుంటారు. అన్నీ కుదిరితే ఆ హీరోతో పాటు, ద‌ర్శకుడు సైతం ప్రేక్షకుల ఆలోచనకే తలొగ్గుతారు. తమ కాంబోని రిపీట్ చేస్తారు.  సినీరంగంలో కేవలం ఒక సినిమాతోనే ఆగిపోని సూపర్ హిట్ జర్నీలు చాలానే ఉన్నాయి.

నిజంగానే కాంబో వర్కవుట్ అవ్వాలి గానీ..  ఒకే దర్శకుడితో రెండేసి చిత్రాలు చేసే హీరోలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ కాంబో అయిన విజయ్‌ (Vijay), లోకేష్‌ కనగరాజ్‌‌లు రెండో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు.  

వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన 'మాస్టర్' సినిమా త‌మిళంతో పాటుగా, తెలుగులోనూ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విజ‌య్ కెరీర్‌లో అత్యధిక షేర్‌ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో మ‌రో సారి ఈ కాంబో ప‌ట్టాలెక్కనున్నట్టు సమాచారం. 

ఇటీవలే జ‌రిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ విషయాన్ని చెప్పాడు. గ‌తంలో మాదిరిగానే వీళ్ల కాంబోలో మరో సినిమా రానుంద‌ని జోరుగా ప్రచారం సాగింది. కాగా ఇప్పుడు ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్  ప్రకటించడంతో, విజ‌య్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం ద‌ళప‌తి విజ‌య్ (Vijay), వంశీ పైడిప‌ల్లితో ఓ సినిమా చేస్తున్నారు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మికా మందాన హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన త‌ర్వాత, విజయ్, కనగరాజ్‌ల కాంబోలో సినిమా పట్టాలెక్కే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!