Kushi: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై వ‌చ్చిన వార్త‌లు నిజం కాదంటున్న‌ ద‌ర్శ‌కుడు

Updated on May 24, 2022 02:16 PM IST
Kushi: ఖుషి షూటింగ్‌లో విజ‌య్, స‌మంత‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్మాణ ట్వీట్ చేశారు
Kushi: ఖుషి షూటింగ్‌లో విజ‌య్, స‌మంత‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్మాణ ట్వీట్ చేశారు

Kushi: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ , స‌మంత ఖుషి సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ వార్త‌ల‌పై ఖుషి సినిమా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ స్పందించారు. ఓ యాక్ష‌న్ సీన్ చేస్తున్నప్పుడు విజ‌య్, స‌మంతలకు ప్ర‌మాదం జ‌రిగిందనే న్యూస్ వైర‌ల్ అయింది. అలాంటి వార్త‌లు న‌మ్మ‌కండంటూ క్లారిటీ ఇచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌లు హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాకు శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ, థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Kushi: ఖుషి షూటింగ్‌లో విజ‌య్, స‌మంత‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్మాణ ట్వీట్ చేశారు

రీసెంట్‌గా ఖుషి సినిమా కశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క‌శ్మీర్‌లో ఓ యాక్ష‌న్ సీన్ షూట్ చేసేట‌ప్పుడు విజ‌య్ (Vijay Deverakonda), స‌మంత‌ (Samantha)లు నీళ్ల‌లో ప‌డిపోయార‌ని న్యూస్ వైర‌ల్ అయింది. అంతేకాదు వీరిద్ద‌రూ ప్ర‌యాణిస్తున్న కారు లోయ‌లో ప‌డిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఖుషి సినిమా షూటింగ్‌లో విజ‌య్, సామ్‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని శివ నిర్వాణ తెలిపారు. శివ నిర్వాణ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫేక్ వార్త అంటూ పోస్ట్ పెట్టారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌న్నారు. 

శివ నిర్వాణ (Shiva Nirvana)  ద‌ర్శ‌క‌త్వంలో ఖుషి రొమాంటిక్ ల‌వ్, థ్రిల్ల‌ర్ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్ర‌ తొలి షెడ్యూల్ క‌శ్మీర్‌లో జ‌రిగింది. ఆ త‌ర్వాత చిత్ర టీం హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. జూన్ లో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న ఇది విడుదల కానుంది.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!