Venkatesh : వెంకటేష్, రవితేజ కాంబినేషన్‌లో మల్టీస్టారర్! కథ రెడీ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !

Updated on Jun 21, 2022 11:03 PM IST
మాస్ మహారాజా రవితేజ, విక్టరీ వెంకటేష్
మాస్ మహారాజా రవితేజ, విక్టరీ వెంకటేష్

మల్టీస్టారర్‌‌ సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు విక్టరీ వెంకటేష్ (Venkatesh). చెప్పినట్టుగానే సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, లోకనాయకుడు కమల్ హాసన్‌తో ‘ఈనాడు’, పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’, శ్రీకాంత్‌తో ‘షాడో’, ‘సంక్రాంతి’, నాగచైతన్యతో ‘వెంకీ మామా’, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌తో ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ సినిమాలు చేసి టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు వెంకటేష్.

ఒక వైపు మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే, సోలో హీరోగానూ సినిమాలు చేస్తూ కెరీర్‌‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు వెంకీ. కరోనా లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు బంద్ అయి ఉన్న సమయంలో, ఓటీటీలో ‘నారప్ప’ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్‌ 3‘ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు వెంకటేష్. అలాగే రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమాలు

పాన్‌ ఇండియా సినిమాలుగా కూడా..

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ హవా కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌‘ సినిమాలో మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌ కలిసి నటించారు. కొరటాల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆచార్య‘ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్.. ‘భీమ్లానాయక్‌‘ సినిమాలో పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటించారు.

‘గాడ్‌ఫాదర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగా 154 లో చిరుతో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. అలాగే సల్మాన్‌ఖాన్‌ హీరోగా చేస్తున్న హిందీ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ కీలకపాత్ర పోషించనున్నారు. ఇక తమిళంలో సూపర్‌‌హిట్ అయిన ‘వినోదాయ సితం’ తెలుగు రీమేక్‌లో సాయిధరమ్‌ తేజ్‌తో పవన్‌ కల్యాణ్‌ కలిసి నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా,  టాలీవుడ్‌లో మరికొన్ని మల్టీస్టారర్‌‌ సినిమాలు కూడా మొదలు కాబోతున్నాయని తెలుస్తోంది. తాజాగా మల్టీస్టారర్ సినిమాలపై మరో క్రేజీ అప్‌డేట్‌ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

టాలీవుడ్‌లో సూపర్‌‌స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, కొత్త బంగారు లోకం, బ్రహ్మోత్సవం, నారప్ప వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్‌‌ శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు మరో క్రేజీ కథతో మల్టీస్టారర్ తీయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి వెంకీతోపాటు మాస్ మహారాజాను ఒకే స్క్రీన్‌పై చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడట శ్రీకాంత్.

వెంకీ ఓకే చెప్పాడా..

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ లైన్‌ను వెంకీకి శ్రీకాంత్ చెప్పాడని, దానికి వెంకటేష్‌ కూడా ఓకే చెప్పాడని టాక్. ఇదే క్రమంలో మరో హీరో రవితేజకు కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడంట శ్రీకాంత్ అడ్డాల. ఇక మాస్‌ మహారాజాకు కూడా కథ నచ్చి సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే.. వెంకీ (Venkatesh), రవితేజ ఫ్యాన్స్‌కు పండగే. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి మరి.

Read More : రానా నాయుడు సిరీస్‌తో కొత్త ట్రెండ్‌‌కు శ్రీకారం చుట్టిన బాబాయ్ - అబ్బాయ్ .. ఫోటోలు వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!