Dj Tillu Part 2: 'డీజే టిల్లు' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఆగస్టు నుంచి షూటింగ్ షురూ!

Updated on Jun 25, 2022 04:49 PM IST
జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఈ మూవీలో ప‌క్కా హైద‌రాబాదీ స్టైల్‌లో కామెడీ ట‌చ్‌తో చేసిన యాక్టింగ్ యూత్ కు పిచ్చెక్కించింది.
జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఈ మూవీలో ప‌క్కా హైద‌రాబాదీ స్టైల్‌లో కామెడీ ట‌చ్‌తో చేసిన యాక్టింగ్ యూత్ కు పిచ్చెక్కించింది.

Dj Tillu: టాలీవుడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్‌లుగా వచ్చిన చిత్రం 'డీజే టిల్లు' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 

కరోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ సినిమాల్లో  ఇది కూడా ఒక‌టి. గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఈ మూవీలో ప‌క్కా హైద‌రాబాదీ స్టైల్‌లో కామెడీ ట‌చ్‌తో చేసిన యాక్టింగ్ యూత్ కు పిచ్చెక్కించింది. యంగ్ స్టార్స్, కాలేజీ పిల్లలు డీజే టిల్లు సినిమాను బాగా ఆదరించారు. ముఖ్యంగా డీజే టిల్లు సాంగ్స్ దుమ్ములేపాయి.

అలాగే ఈ సినిమాలో టిల్లు మేనరిజం కూడా ఇంకా ట్రెండ్‌లోనే ఉంది. చిత్రంలో సిద్ధు చెప్పిన ‘అట్లుంటది మనతోటి’ అనే డైలాగ్ కూడా వాడుకలోనే ఉంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ (Dj Tillu Movie) అంశాల‌కు వినోదాన్ని జోడించి రూపొందించిన ఈ సినిమాలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క్యారెక్ట‌రైజేష‌న్‌, హైద‌రాబాదీ యాస‌లో అత‌డు చెప్పిన డైలాగ్స్ అలరించాయి. 

అంచనాలకు తగ్గట్టుగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఆకట్టుకోవడమే కాక బంపర్ హిట్ కూడా కొట్టింది. అయితే డీజే టిల్లు ఫీవర్ తగ్గకముందే సెకండ్ పార్ట్ (Dj Tillu Part 2) ను కూడా తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు  మేకర్స్.

ఫ‌స్ట్ పార్ట్  తెర‌కెక్కించిన సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లోనే సెకండ్ పార్ట్ కూడా రానుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే సిధ్దు అండ్ టీం స్క్రిప్టు ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారంట. 

తాజాగా నిర్మాత నాగ వంశీ కూడా (Producer Nagavamshi) అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఒకటి చేశారు. ‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీ రౌండ్ 2 కోసం సిద్ధమవుతోంది.  ఆగస్ట్‌లో క్రేజీ అడ్వెంచర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది’ అని ఆయన అప్డేట్ అందించారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు.

తొలి భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విమల్ కృష్ణ రెండో భాగాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. అయితే క‌థానాయిక‌గా నేహా శెట్టి క‌నిపిస్తుందా? లేకపోతే ఆమె స్థానంలో మరొకరిని తీసుకుంటారా అన్నది చూడాల్సిందే. ఈ సీక్వెల్‌కు విమల్ కృష్ణతో కలిసి సిద్ధు జొన్నలగడ్డ కథను అందిస్తున్నారు.

Read More: క్రేజ్ త‌గ్గే సినిమాలు చేయ‌నంటున్న డీజే టిల్లు!(Siddhu Jonnalagadda )

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!