సర్కారు వారి పాట (Sarkar Vaari Paata) : పైరసీ వివరాలు తెలియజేయమని నిర్మాతల విన్నపం

Updated on May 12, 2022 02:34 PM IST
సినిమా విడుదలకు కొద్ది గంటల ముందే ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని, అలా ఎవరైనా చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు
సినిమా విడుదలకు కొద్ది గంటల ముందే ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని, అలా ఎవరైనా చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు

ప్రిన్స్ మహేశ్‌ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్‌ అందరికీ ఈ రోజు పండగ రోజు. ఎందుకంటే వారి అభిమాన నటుడి చిత్రం "సర్కారు వారి పాట" (Sarkaru Vaari Paata) థియేటర్లలో ఊహించని రీతిలో దూసుకుపోతోంది. పరశురామ్‌ డైరెక్షన్‌లో మహేశ్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ రోజు (మే 12న) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఐనాక్స్‌ల వద్ద, థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. 

యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సినీ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్  .. ఈ మూడు నిర్మాణ సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించారు. అలాగే సంగీత దర్శకుడు తమన్‌ బాణీలు సమకూర్చారు. 

మరో వైపు, ఈ సినిమా విడుదలకు కొద్ది గంటల ముందే ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని, అలా ఎవరైనా చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సినిమా మూవీ పైరసీకి సంబంధించిన వివరాలు తెలిస్తే, అభిమానులు  8978650014,9912425159, 8881108888 నంబర్లకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని కోరారు. అలాగే యాంటిపైరసీ.కామ్‌ (antipiracysolution) వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!