Acharya Updates: ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు.. ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Updated on Apr 19, 2022 07:12 PM IST
ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు సమాచారం.
ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన సినిమా ‘ఆచార్య’. సాధారణంగా మెగాస్టార్‌‌ సినిమా అంటే సాధారణంగా ఉండే క్రేజ్‌కు రామ్‌చరణ్‌ తోడయ్యాడు.

ఇక, వీళ్లిద్దరూ బాక్సాఫీసు దగ్గర చేయబోయే సందడికి ఫ్యాన్స్‌ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఈనెల 23న హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్​లో జరగనుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇద్దరు మెగాస్టార్‌‌లను ఒకే వేదికపై చూడడానికి అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులకు మరో బంపర్ ఫీస్ట్‌ అందనున్నట్టు తెలిసింది.

ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు సమాచారం. ముందుగా ఈ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించనున్నారని, ఏపీ సీఎం జగన్‌ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా హాజరవుతారని ప్రచారం జరిగింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!