కృష్ణవంశీ (Krishna Vamsi) ‘రంగమార్తాండ’ బ్యాక్‌గ్రౌండ్ పనులు పూర్తి.. వీడియో షేర్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్

Updated on Jun 18, 2022 12:11 AM IST
కృష్ణవంశీ (Krishna Vamsi) రంగమార్తాండ సినిమా పోస్టర్
కృష్ణవంశీ (Krishna Vamsi) రంగమార్తాండ సినిమా పోస్టర్

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (KrishnaVamsi) చాలా కాలం త‌ర్వాత రూపొందిస్తున్న సినిమా 'రంగ‌మార్తాండ'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలాకాలం కావడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రంగమార్తాండ సినిమా గురించి అప్‌డేట్‌ వస్తుందా.. సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారా అనే విషయాల గురించి నెట్‌లో సెర్చ్‌ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో 'రంగమార్తాండ సినిమా గురించి ఒక బిగ్ అప్‌డేట్‌ వచ్చింది.

తాజాగా 'రంగమార్తాండ' సినిమా షూటింగ్ పూర్తయిందని, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోందని తెలిసింది.  సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌లో తాను బిజీగా ఉన్నానని, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాతో బ్యాక్‌ గ్రౌండ్ స్కోరు చేయించే పనిలో కూడా ఉన్నానని ఇటీవలే కృష్ణవంశీ తెలిపారు.  అందుకు సంబంధించిన పలు వీడియోలకు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలతో 'రంగమార్తాండ' సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులకు ఉన్న క్యూరియాసిటీని మరింతగా పెంచేస్తున్నారు.

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాతో కృష్ణవంశీ (Krishna Vamsi)

బ్యాక్‌గ్రౌండ్ పనులు..

కాగా  ఈ రోజు కృష్ణవంశీ మరో కొత్త అప్డేట్‌‌‌తో వచ్చారు.   'రంగ‌మార్తాండ' సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌నులు  పూర్తయ్యాయ‌ని, అవుట్ పుట్  బాగా వచ్చినందుకు ఆనందంగా ఉందని  తెలిపారు కృష్ణవంశీ. కాగా, 'రంగమార్తాండ' సినిమా షూటింగ్‌ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.

ఈ క్రమంలో త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రంగమార్తాండ' సినిమాలో అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

కృష్ణవంశీ (Krishna Vamsi)కి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా రాసిన లెటర్

2017 తర్వాత..

మరాఠిలో సూపర్ హిట్ సాధించిన ‘నట సామ్రాట్’ సినిమాకు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. 2017వ సంవత్సరంలో  సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, సందీప్ కిష‌న్‌, రెజీనా క‌సాండ్రా హీరోహీరోయిన్లుగా 'న‌క్షత్రం' సినిమాను తెరకెక్కించిన కృష్ణవంశీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. 

ఈ క్రమంలో దాదాపు అయిదు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..  ఇప్పుడు 'రంగ‌మార్తాండ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి, ఈ సినిమాతో అయినా, ఈ క్రియేటివ్ డైరెక్టర్ భారీ హిట్ అందుకొని.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది చూడాలి.

జెడి చక్రవర్తి హీరోగా గులాబి, మహేష్‌బాబుతో మురారి,   కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో చందమామ, జూనియర్ ఎన్టీఆర్‌‌ కాంబినేషన్ లో రాఖీ, నాగార్జునతో నిన్నే పెళ్లాడతా,  నితిన్ హీరోగా శ్రీ ఆంజనేయం, రామ్ చరణ్‌ కథానాయకుడిగా గోవిందుడు అందరివాడేలే మొదలైన సినిమాలను తీసిన  కృష్ణవంశీ (KrishnaVamsi), ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు.

సిందూరం, అంతఃపురం, డేంజర్, మహాత్మ లాంటి మంచి సబ్జెక్టు ఓరియంటెడ్ సినిమాలు కృష్ణవంశీ టాలెంట్‌కు నిదర్శనాలు. మరి 'రంగ‌మార్తాండ' ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలంటే, సినిమా విడుదల అయ్యే వరకూ వేచి చూడాల్సిందే. 

Read More : ‘జైలర్‌‌’గా రాబోతున్న సూపర్‌‌స్టార్‌‌ రజినీకాంత్‌ (Rajinikanth).. టైటిల్‌ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!