మహేష్‌ (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ డైరెక్టర్‌ తర్వాత సినిమా ఎవరితో? ‌

Updated on Apr 29, 2022 08:26 PM IST
మహేష్‌బాబు (MaheshBabu), డైరెక్టర్‌‌ పరశురాం
మహేష్‌బాబు (MaheshBabu), డైరెక్టర్‌‌ పరశురాం

కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీపై కూడా పడింది. దాదాపు అన్ని సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకున్నా రిలీజ్​కు నోచుకోలేదు. దీంతో వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజవుతున్నాయి. ఇండస్ట్రీ కూడా కొంత ఊపిరిపీల్చుకుంటోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్‌ ఇండియా సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, అఖండ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కేజీఎఫ్‌ పార్ట్‌ 2, మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్‌ నటించిన ఆచార్య సినిమాలు రిలీజయ్యాయి. ఇక, సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) మరిన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

షూటింగ్‌ పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్‌ కాకపోవడంతో వేరే సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికి చాలాకాలం ఎదురుచూశారు. ఇప్పుడు వాటన్నింటికీ పుల్‌స్టాప్‌ పడుతోంది. తమ తదుపరి ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు డైరెక్టర్లు. ఈ క్రమంలోనే టాలెంటెడ్‌ డైరెక్టర్ పరశురాం తీయబోయే తరువాతి సినిమా గురించి చర్చ మొదలైంది. అందులో హీరో ఎవరు అనే దానిపై అప్‌డేట్‌ వచ్చింది.

ఇటీవల మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా తీసిన దర్శకుడు పరశురాం.. తరువాత ప్రాజెక్టులో అక్కినేని నాగచైతన్య హీరోగా చేయబోతున్నట్టు తెలుస్తోంది. చాలారోజుల నుంచి చైతన్యతో సినిమా చేయాలని పరశురాం ప్లాన్‌ చేస్తున్నాడు. దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ఇటీవల పూర్తయ్యిందని సమాచారం. వీరిద్దరి కలయికలో సినిమాపై ఎప్పుడో జరగాల్సిన డిస్కషన్స్‌ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

మహేష్‌బాబుతో చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పరశురాం ఫోకస్‌ తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై పెట్టాడు. దీంతో చైతన్య సినిమాను పట్టాలెక్కించడానికి పరశురాం రెడీ అవుతున్నాడని టాక్. సర్కారు వారి పాట సినిమా నిర్మిస్తున్న 14 రీల్స్‌ బ్యానర్‌‌లోనే నాగచైతన్య సినిమా కూడా రాబోతోంది.

ఇక, మహేష్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న రిలీజ్ కానుంది. దీంతో ఆ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో  పరశురాం బిజీగా ఉన్నారు. మహేష్‌ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగచైతన్య సినిమా షూటింగ్‌ను పట్టాలెక్కంచబోతున్నాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

తమ అభిమాన హీరో నాగచైతన్యను పరశురాం ఎలాంటి కథలో చూపించబోతున్నాడోనని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చై ప్రస్తుతం ఆమిర్‌‌ఖాన్‌ నటిస్తున్న లాల్‌సింగ్‌ ఛద్దాలో కీలకపాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు రాశీఖన్నాతో కలిసి థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!