Mahesh Babu - ఫ్యాన్స్ కోసం మాస్‌ స్టెప్స్‌ వేస్తున్న మహేశ్

Updated on Apr 19, 2022 06:57 PM IST
సరికొత్త స్టైల్‌తో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్దమవుతున్నాడు మహేశ్‌.
సరికొత్త స్టైల్‌తో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్దమవుతున్నాడు మహేశ్‌.

టాలీవుడ్‌లో సూపర్‌‌స్టార్ మహేశ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’లో ఈ ప్రిన్స్‌ వేసిన మాస్ స్టెప్స్​కు థియేటర్లలో ఫ్యాన్స్​ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.

ఇప్పుడు సరికొత్త స్టైల్‌తో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్దమవుతున్నాడు మహేశ్‌. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మాస్‌ సాంగ్‌ చిత్రీకరణ హైదరబాద్‌ రామోజీ ఫిల్మ్​సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ పాట మినహా సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందని సమాచారం.

శేఖర్ మాస్టర్‌‌ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట చిత్రీకరణ ఈనెల 21తో పూర్తవుతుందని తెలుస్తోంది. తమన్ సంగీతం అందించగా ఇప్పటికే రిలీజైన పాటలు అభిమానులకు అలరిస్తుండగా.. యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లలో కూడా లక్షల వ్యూస్ రాబట్టిన విషయం తెలిసిందే.

మహేశ్‌ లుక్‌ కొత్తగా ఉండడంతోపాటు పోకిరి సినిమా వైబ్స్ ఉంటాయని చిత్ర బృందం హింట్‌ ఇవ్వడంతో ‘సర్కారు వారి పాట’పై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. భారీ అంచనాలతో ఈ సినిమా మే 12న రిలీజ్‌ కాబోతోంది,

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!