తెలుగు సినిమా ఏదీ ఓకే చేయలేదంటున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor)

Updated on Apr 22, 2022 10:07 PM IST
జాన్వీ   కపూర్
జాన్వీ కపూర్

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ‘లైగర్’ తర్వాత రాబోతున్న సినిమా ‘జన గణ మన’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఆర్మీ, వార్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్‌ చేయకముందే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. వంశీ పైడిపల్లి, డైరెక్టర్ పూరిజగన్నాథ్‌, హీరోయిన చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది.

ఫిమేల్‌ లీడ్‌ రోల్‌లో జాన్వీ కపూర్ కనిపిస్తుందనే వార్తలు వచ్చాయి. తెలుగులో ‘జన గణ మన’ సినిమాతో జాన్వీ కపూర్ అరంగేట్రం చేయనుందని అందరూ అనుకున్నారు. అయితే దీనిపై జాన్వీ కపూర్ తాజాగా వివరణ ఇచ్చింది. టాలీవుడ్‌లోకి తన ఎంట్రీపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని జాన్వీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు తాను తెలుగు సినిమా చేయడానికి అంగీకారం చెప్పలేదని, ఒకవేళ టాలీవుడ్‌లో ఏదైనా సినిమాకి సంతకం చేస్తే ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది జాన్వీ. 

ఏప్రిల్‌ నెల నుంచి జన గణ మన సినిమా షూటింగ్‌ స్టార్ట్ కాబోతోందని సమాచారం. కాగా, 2023 ఆగస్టు 3వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్‌ కానుంది.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!