ఆ సినిమా రీమేక్ పనిమీదే హరీష్‌ శంకర్ (Harish Shankar) ముంబై వెళ్లాడా.. మెహబూబా స్టూడియో వద్ద పిక్‌ వైరల్

Updated on May 19, 2022 10:35 AM IST
హరీష్‌ శంకర్ (Harish Shankar)
హరీష్‌ శంకర్ (Harish Shankar)

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చేయ‌బోతున్న భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు స్టార్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar). క్రిష్‌ డైరెక్షన్‌లో పవన్‌ చేస్తున్న హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు షూటింగ్ పూర్తయిన త‌ర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఇటీవ‌ల హ‌రీష్ శంక‌ర్ ముంబైలోని మెహ‌బూబా స్టూడియో ద‌గ్గర దిగిన ఫొటో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంతకీ హ‌రీష్ శంక‌ర్ ఏ ప‌ని మీద ముంబై వెళ్లాడనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌చ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ 2018లో న‌టించిన సినిమా రైడ్. ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను హ‌రీష్ శంక‌ర్ తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. దీనికి సంబంధించిన పని గురించే గ‌త వారం ముంబై వెళ్లాడనే ఇండస్ట్రీలో టాక్‌. అయితే దీనిపై హ‌రీష్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు వెబ్ సిరీస్ ATMకు హరీష్‌ కో ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నాడు. వ‌రుణ్‌తేజ్‌తో గ‌ద్దల కొండ గ‌ణేశ్ సినిమా తీసిన హ‌రీష్‌ శంక‌ర్ మంచి హిట్‌ అందుకున్నాడు.

రామ్‌ తర్వాత సినిమా పవన్‌ కల్యాణ్‌తో గబ్బర్‌‌సింగ్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్‌‌ హరీష్ శంకర్‌(Harish Shankar)‌తో చేయనున్నట్టు టాలీవుడ్‌ టాక్. ఈ మధ్యనే రామ్‌కు హరీష్‌ స్టోరీ లైన్‌ చెప్పాడని, దానికి రామ్‌ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వచ్చే చాన్స్‌ ఉందని సమాచారం . ప్రస్తుతం హరీష్‌ శంకర్‌‌ పవన్‌ కల్యాణ్‌తో భవదీయుడు భగత్‌ సింగ్ సినిమా తీయనున్నట్టు ప్రకటించాడు. జూలై నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా తర్వాత రామ్‌తో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!