Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఆర్జే సూర్య (RJ Surya)!

Updated on Oct 06, 2022 11:50 PM IST
చివరికి సుదీప (Sudeepa), ఆరోహి (Arohi) మిగిలారు. స్టేజ్‌పై రెండు కుండలు ఉంచి.. వాటిలో నీళ్లు పోశారు నాగార్జున.
చివరికి సుదీప (Sudeepa), ఆరోహి (Arohi) మిగిలారు. స్టేజ్‌పై రెండు కుండలు ఉంచి.. వాటిలో నీళ్లు పోశారు నాగార్జున.

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో (Biggboss Season 6) ఊహించ‌ని విధంగా ఆరోహి (Arohi) బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే, అంతకుముందు సండే అంటే ఫండే అంటూ ఆదివారం హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చేశారు. అనంతరం దసరా స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున తాజాగా నటించిన 'ది ఘోస్ట్' (The Ghost) టీమ్ సంద‌డి చేసింది. హీరోయిన్ సోనాల్ చౌహాన్‌, దర్శకుడు ప్రవీణ్ స‌త్తారు ఈ షోకు హాజరై అలరించారు. 

ఆ తర్వాత ఇంటి సభ్యులతో ఘోస్ట్‌ గేమ్ ఆడించారు నాగార్జున‌ (Nagarjuna). హౌజ్‌లో ఈవిల్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారో వారిని షూట్ చేయాల‌ని అన్నాడు. అనంతరం ఇచ్చిన పూల బుట్ట‌ల టాస్క్‌లో ఇనాయా సుల్తానా సేఫ్ అయ్యింది. ఇక, 'ది ఘోస్ట్‌' టీమ్‌కు టాటా చెప్పేసి.. హౌస్‌మెట్స్‌తో మరో గేమ్ ఆడించారు నాగార్జున. అమ్మాయిలు, అబ్బాయిలు టీమ్‌లుగా డివైడ్ చేసి గేమ్స్ ఆడించారు. ఈ ఆటలు తరువాత నామినేషన్లలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో పెట్టే చేతికి ఇచ్చి.. ఇందులో రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. అనంతరం బతుకమ్మ పాటలకు హౌస్‌లోని కంటెస్టెంట్స్ డ్యాన్స్ వేశారు.

ఇక, బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున కీర్తి భట్ తో మాట్లాడుతున్న స‌మ‌యంలో గీతూ రాయల్ (Geetu Royal) ప‌దే ప‌దే అడ్డుత‌గ‌ల‌డంతో నాగార్జున ఫైర్ అయ్యాడు. చంటితో జ‌రిగిన గొడ‌వ‌ను గుర్తుచేసుకొని గీతూ క‌న్నీళ్లు పెట్టుకుంది. నాగార్జున క్లారిటీ ఇవ్వ‌డంతో త‌న త‌ప్పు తెలుసుకున్న కీర్తి.. చంటికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. గీతూను, చంటిని క‌లిపే బాధ్య‌త‌ను బాలాదిత్య‌, ఫైమాల‌కు అప్ప‌గించాడు నాగార్జున‌.

ఇక, చివరకు నామినేషన్లలో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్‌ను సేవ్ చేస్తూ వచ్చారు హోస్ట్ నాగార్జున. చివరికి సుదీప (Sudeepa), ఆరోహి (Arohi) మిగిలారు. స్టేజ్‌పై రెండు కుండలు ఉంచి.. వాటిలో నీళ్లు పోశారు నాగార్జున. వాటిలో నుంచి రెడ్ కలర్ వచ్చిన ఆరోహి ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. ఆరోహి హౌస్ నుంచి వెళ్లిపోతుండడంతో ఆర్జే సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంద‌రూ ఎమోష‌న‌ల్ అవ్వ‌డంతో పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్న‌ట్లుగా ఉంద‌ని ఆరోహి చెప్పింది. మంచిగా ఆడు అంటూ సూర్యకు.. హౌస్‌మెట్స్‌కు టాటా చెప్పేసి స్టేజ్‌పైకి వచ్చేసింది. అయితే ఆరోహి వెళ్లిపోయినా కీర్తి, ఆర్జే సూర్య మాత్రం కన్నీళ్లు ఆపలేదు.

అనంతరం స్టేజ్‌పైకి వ‌చ్చిన ఆరోహికి (Arohi) స్వ‌చ్ఛం, క‌ల్మ‌షం టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో బాలాదిత్య‌, శ్రీహాన్‌, ఆర్జే సూర్య‌, కీర్తి, వాసంతి, రోహిత్‌-మెరీనా స్వ‌చ్ఛం అని.. రేవంత్‌, గీతూ, చంటి, సుదీప‌, శ్రీస‌త్య‌, ఇనాయాల‌కు క‌ల్మ‌షం అని తన మనసులో మాటను బయటపెట్టింది.

Read More: Bigg Boss Telugu 6 : 'చలాకీ చంటి' (Chalaki Chanti) గురించి టాప్ టెన్ విశేషాలు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!