పెళ్లి పీటలెక్కిన తెలుగు హీరోయిన్ మధు శాలిని (Madhu Shalini).. తమిళ హీరోను పెళ్లాడినట్టు సోషల్ మీడియాలో వెల్లడి !

Updated on Jun 21, 2022 04:35 PM IST
గోకుల్ ఆనంద్‌తో మధుశాలిని (Madhu Shalini)
గోకుల్ ఆనంద్‌తో మధుశాలిని (Madhu Shalini)

ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలైంది స్టార్‌ హీరోయిన్ నయనతార. తాజాగా మరో హీరోయిన్‌ కూడా పెళ్లి చేసుకుంది.

అయితే నయనతార మాదిరిగా అభిమానులు, మీడియాకు తెలిసేలా కాకుండా.. సైలెంట్‌గా పెళ్లి చేసుకుని సర్‌‌ప్రైజ్ ఇచ్చింది.. ఇటీవలే '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌తో అలరించిన తెలుగు హీరోయిన్ మధుశాలిని(Madhu Shalini).

తమిళ హీరో గోకుల్‌ ఆనంద్‌తో మధుశాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

తమిళ పంచాక్షరం సినిమా పోస్టర్

‘పంచాక్షరం’ సినిమా టైంలో పరిచయం..

తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ అచ్చ తెలుగు హీరోయిన్. ‘పంచాక్షరం’ అనే తమిళ సినిమాలో గోకుల్, మధుశాలిని కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికీ మధ్య స్నేహం కుదిరిందని, అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తోంది.

అల్లరి నరేష్‌ హీరోగా నటించిన ‘కితకితలు’ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది మధు శాలిని. ఆ తర్వాత ‘ఒక విచిత్రం’, ‘ఆగంతకుడు’, ‘వాడు -వీడు’, ‘గోపాల గోపాల’ సినిమాల్లో నటించిన మధు శాలిని (Madhu Shalini).. నాగార్జున నటించిన కింగ్ సినిమాలో ఒక సాంగ్‌లోనూ నర్తించింది. ఇక, గోకుల్‌ పలు తమిళ సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌ల్లో కూడా నటించాడు. 

Read More : మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ : నయన్ & విక్కీ (Nayanthara & Vignesh Shivan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!