Allari Naresh: ‘నాంది’ డైరెక్టర్‌‌తో అల్లరి నరేష్‌ మరో సినిమా.. ఫస్ట్‌ లుక్‌తోనే ఆసక్తి పెంచేసిన మేకర్స్

Updated on Jun 27, 2022 06:04 PM IST
అల్లరి నరేష్‌, డైరెక్టర్ కనకమేడల విజయ్
అల్లరి నరేష్‌, డైరెక్టర్ కనకమేడల విజయ్

కామెడీ సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్న అల్లరి నరేష్ (Allari Naresh).. తాజాగా నాంది సినిమాతో సీరియస్‌ క్యారెక్టర్‌‌ చేసి మంచి హిట్ అందుకున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన నాంది సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. అప్పటి వరకు కామెడీ జోనర్‌‌ సినిమాలే చేస్తూ వచ్చిన అల్లరి నరేష్.. చాలాకాలం తర్వాత పూర్తి స్థాయి సీరియస్ పాత్ర చేసి అభిమానులను ఎంటర్‌‌టైన్ చేశారు.

చాలాకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్‌కు నాంది సినిమా గ్రేట్ కంబ్యాక్‌ అనే చెప్పాలి. ఈ సినిమాలో నరేష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అలాగే దర్శకుడిగా విజయ్‌కు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.   

కొత్త సినిమా పోస్టర్

పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్..

ఇదిలా ఉంటే ఈ హిట్‌ కాంబినేషన్‌లో మ‌రో సినిమా రాబోతున్నట్టు తాజాగా ప్రక‌టించారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్ విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌‌లో సంకెళ్లతో బంధించిన రెండు చేతుల‌ను నీడ‌లో ప‌క్షిలా కనిపించేలా గోడపై చూపించారు దర్శకుడు. ఫస్ట్‌ లుక్ పోస్టర్‌‌తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. నాంది సినిమా తరహాలోనే తాజాగా తెరకెక్కించబోయే సినిమా కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌‌ అని పోస్టర్‌‌ను చూస్తే తెలుస్తోంది.

షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించ‌నున్నారు. ప్రస్తుతం అల్లరి న‌రేష్ (Allari Naresh) ‘స‌భ‌కు న‌మ‌స్కారం’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాల్లో న‌టిస్తున్నాడు.

Read More : అల్లరి నరేష్‌ (Allari Naresh) @ 20 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. అభిమానులకు థ్యాంక్స్‌ చెప్తూ నోట్‌ రిలీజ్ చేసిన హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!