RGV & Natti Kumar : నట్టి కుమార్‌‌ పై వర్మ పరువు నష్టం దావా

Updated on Apr 20, 2022 08:44 PM IST
కొంతమంది ఏం చేసినా సంచలనమే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు రాంగోపాల్ వర్మ. సినిమా స్టోరీలు, వాటి టైటిల్స్, అందులోని నటీనటులు ఒకటేమిటి సినిమా ప్రకటించినప్పటి నుంచి అది రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్‌ వర్మ సినిమాలో అన్నీ సంచలనాలే ఉంటాయి.
కొంతమంది ఏం చేసినా సంచలనమే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు రాంగోపాల్ వర్మ. సినిమా స్టోరీలు, వాటి టైటిల్స్, అందులోని నటీనటులు ఒకటేమిటి సినిమా ప్రకటించినప్పటి నుంచి అది రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్‌ వర్మ సినిమాలో అన్నీ సంచలనాలే ఉంటాయి.

కొంతమంది ఏం చేసినా సంచలనమే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు రాంగోపాల్ వర్మ. సినిమా స్టోరీలు, వాటి టైటిల్స్, అందులోని నటీనటులు ఒకటేమిటి సినిమా ప్రకటించినప్పటి నుంచి అది రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్‌ వర్మ సినిమాలో అన్నీ సంచలనాలే ఉంటాయి. ఇటీవల తీసిన డేంజరస్‌ సినిమా కూడా అదే రేంజ్‌లో సంచలనమైంది. ఇక, డేంజరస్ సినిమా విషయంలో నట్టి కుమార్‌‌ కూడా పలు కామెంట్లు చేశారు.అంతటితో ఆగకుండా కోర్టుకు వెళ్లి ఆర్డర్‌‌ తీసుకొచ్చొ మరీ సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నారు.

అప్పటి నుంచి వర్మ, నట్టి కుమార్‌‌ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు కింది కోర్టు ఇచ్చిన ఆర్డరును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో సినిమా రిలీజ్‌కు అడ్డుంకులు తొలగిపోయాయి.

మే 6వ తేదీని డేంజరస్ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన వర్మ.. ఫేక్‌ డాక్యుమెంట్లతో సినిమా రిలీజ్‌ను అడ్డుకుని తనకు ఆర్థికంగా నష్టం కలిగించిన నట్టి క్రాంతి, నట్టి కరుణల తండ్రి నట్టి కుమార్‌‌పై పరువు నష్టం దావా వేయనున్నట్టు వర్మ వెల్లడించాడు. అంతేకాకుండా సినిమా రిలీజ్‌కు కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ, సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ కాపీని కూడా పబ్లిక్ డొమైన్‌లో పోస్ట్‌ చేస్తున్నానని చెప్పాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!