రాజశేఖర్‌‌ (RajaShekar) దంపతులపై చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టిన జోష్టర్ ఫిలింస్ (Joster Films)

Updated on Apr 22, 2022 08:41 PM IST
రాజశేఖర్‌‌, జీవిత
రాజశేఖర్‌‌, జీవిత

హీరో రాజశేఖర్ దంపతులపై చెక్‌ బౌన్స్‌ కేసు నమోదు చేసినట్టు జోష్టర్ ఫిలింస్‌ తెలిపింది. గరుడవేగ సినిమా కోసం తమ సంస్థ నుంచి రూ.26 కోట్లు అప్పుగా తీసుకున్నారని ఆరోపణలు చేశారు సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్‌‌ రాజు తెలిపారు. కేసు నమోదు చేయడంతో నగరి కోర్టు ఇద్దరిపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసిందని చెప్పారు.

సంస్థ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ రాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చినట్టు వెల్లడించారు. అప్పు తీసుకున్న డబ్బును బినామీ పేర్ల మీదకు మార్చుకుని తనను మోసం చేశారని అన్నారు. హీరో రాజశేఖర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని కోటేశ్వరరాజు చెప్పారు.

చాలాకాలం తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ సినిమాకు ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌‌ మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొననున్నట్టు ప్రకటించింది. కూతురుతో కలిసి శేఖర్ అనే సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!