షూటింగ్‌లో జారిపడిన గోపీచంద్ (Gopichand)

Updated on Apr 29, 2022 09:07 PM IST
గోపీచంద్​తో (Gopichand) డైరెక్టర్ శ్రీవాస్
గోపీచంద్​తో (Gopichand) డైరెక్టర్ శ్రీవాస్

కొన్నాళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు యాక్షన్‌ హీరో గోపీచంద్‌ (Gopichand). ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. పోయినేడాది రిలీజైన సీటీమార్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం గోపీచంద్‌కు రెండు మంచి హిట్‌ సినిమాలు అందించిన శ్రీవాస్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్‌ సినిమాలు తీసి కెరీర్‌‌ను నిలబెట్టిన శ్రీవాస్‌ దర్శకత్వంలో సినిమా చేసి మరోసారి హిట్‌ ట్రాక్ పట్టాలని అనుకుంటున్నాడు గోపీచంద్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మైసూరులో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చిత్రీకరిస్తున్నారు.

ఈ క్రమంలో షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదం జరిగి గోపీచంద్ గాయపడ్డాడనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తమ అభిమాన హీరోకు ఏమైందని ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై పలు పుకార్లు ఎక్కువవుతున్నాయి. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.

మైసూరులో గోపీచంద్, శ్రీవాస్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అక్కడ ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్న సమయంలో హీరో గోపీచంద్ ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. అయితే అదృష్టవశాత్తు గోపీచంద్‌కు (Gopichand).  ఏం కాలేదు అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరింది. గోపీచంద్‌ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!