డైరెక్టర్ మారుతి (Maruti) తండ్రి మృతి

Updated on Apr 21, 2022 08:28 PM IST
తండ్రితో డైరెక్టర్ మారుతి
తండ్రితో డైరెక్టర్ మారుతి

టాలీవుడ్‌ దర్శకుడు మారుతి తండ్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతి తండ్రి దాసరి వనకుచలరావు గురువారం కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారుతి స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ మచిలీపట్నంలోని తన స్వగృహంలో వనకుచలరావు మృతిచెందారు. తండ్రి మరణవార్త తెలిసిన సినీ రంగ ప్రముఖులు మారుతిని పరామర్శిస్తున్నారు.

ఇండస్ట్రీకి డిస్ట్రిబ్యూటర్‌‌గా వచ్చిన మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాతో డైరెక్టర్‌‌గా తొలిఅడుగులు వేశారు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఆ తరువాత మారుతి దర్శకత్వం వహించిన ‘బస్‌స్టాప్’, ‘భలే భలే మగాడివోయ్’ ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. శర్వానంద్‌తో తీసిన ‘మహానుభావుడు’ అంతగా సక్సెస్‌ కాకపోయినా డైరెక్టర్‌‌గా ఆయనకు మాత్రం మంచిపేరే తెచ్చిపెట్టిందని చెప్పాలి. ప్రస్తుతం గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’ మూవీ తీస్తున్న మారుతి.. తరువాత పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!