తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షో (Indian Idol Show): మోస్ట్ కన్సిస్టెన్సీ సింగ‌ర్స్ వారే..!

Updated on May 02, 2022 05:13 PM IST
తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షో (Telugu Indian Idol Show)
తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షో (Telugu Indian Idol Show)

తెలుగు సింగింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న షో "తెలుగు ఇండియన్ ఐడల్". ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ షో మొద‌లైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ - సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, సింగర్ కార్తీక్, హీరోయిన్ నిత్యామీనన్ లు ఈ టాలెంట్ హంట్ షోకి జ‌డ్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో షోకి విశేషంగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. 

అయితే ఈ వారం సింగ‌ర్స్ మ‌ధ్య‌ డబుల్ ధమాకా స్పెషల్ ఎపిసోడ్స్ జ‌రిగాయి. కంటెస్టెంట్స్ కు తోడుగా ప్లే బ్యాక్ సింగర్స్ వ‌చ్చి పాట పాడారు. కాగా, ఈ సందర్భంగా నిత్య మీనన్, థ‌మన్ మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. సింగర్ శ్రావణ భార్గవితో జోడీ కట్టిన మారుతి.. 'MCA' సినిమాలోని 'ఏవండోయ్ నాని గారు' అనే పాటను ఆలపించారు. ఈ పాట విష‌యంలోనే వారిద్ద‌రి మ‌ధ్య వివాదం జ‌రిగింది.

నిన్న‌టితో ఈ షో లో డ‌బుల్ ధ‌మాకా ఎపిసోడ్ పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలో ఇందులో భాగంగా జ‌రిగిన ఈ రౌండ్ లో సింగ‌ర్లు లాల‌స‌, వైష్ణ‌వి ఉత్త‌మ కన్సిస్టెంట్ సింగ‌ర్స్ గా ఎంపిక‌య్యారు. వీరు ఈ రౌండ్ లోని త‌మ ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు గానూ దీనికి ఎంపిక కావ‌డం విశేషం. ఈ చివ‌రి ఎపిసోడ్ కు టీమిండియా క్రికెటర్ హ‌నుమ విహారి ప్ర‌త్యేక అతిథిగా హాజ‌రై వారికి ఈ అవార్డు అందజేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!