పూర్తయిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘ఖుషి’ సినిమా ఫస్ట్ షెడ్యూల్.. ఫోటోలు షేర్ చేసిన చిత్ర యూనిట్

Updated on May 24, 2022 10:38 AM IST
ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్ట్‌ చేసిన ఫోటో
ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్ట్‌ చేసిన ఫోటో

హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ . మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మహానటి’ చిత్రం సూపర్ హిట్ తర్వాత విజయ్, సమంత ఈ మూవీలో మరోసారి జోడీ కడుతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో విజయ్‌ – సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు అందంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా లొకేషన్స్‌ను సెలెక్ట్‌ చేస్తున్నారు మేకర్స్.

కొద్ది రోజుల క్రితమే పూజా కార్యక్రమం నిర్వహించిన ఈ సినిమా షూటింగ్‌ను రెగ్యులర్ షూటింగ్‌ మొదలు పెట్టింది చిత్ర బృందం. మొదటి షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో మొదలుపెట్టారు. అక్కడే విజయ్, సామ్‌ల బర్త్ డే వేడుకలు కూడా జరిపారు. ఇక, తాజాగా ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అంతా దిగిన ఫోటోను షేర్ చేశారు. అలాగే రెండో షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభించనున్నట్టు కానున్నట్టు తెలిపారు.

ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్ట్‌ చేసిన ఫోటో

ఇంతకుముందు శివ నిర్వాణ తీసిన ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ సినిమాల తరహాలో..  ఈ సినిమాలోనూ విజయ్, సామ్‌ల మధ్య సాగే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తాయని చెబుతున్నారు మేకర్స్‌.  ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ వంటి డిఫరెంట్ ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ పాత్రను పోషిస్తున్నాడట. సామ్ క్యారెక్టర్‌‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని టాక్. ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.  హేషమ్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!