Raashi Khanna: ఒకే నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా..!

Published on Jun 29, 2022 05:36 PM IST

Raashi Khanna: రాశీఖన్నా.. ఈ భామ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. తాజాగా మరోసారి గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నారు.  

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్నారు. సినిమా నుంచి విడుదలకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. 

మరోవైపు.. రాశీ ఖన్నా నటిస్తున్న మరో సినిమా ‘థాంక్యూ’. నాగ చైతన్య (Thank You) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ రూపొందిస్తున్నారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోది. ముందుగా ఈ సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకొన్నారు. అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ను జూలై 22వ తేదీకి మార్చారు. అన్ని కమర్షియల్‌ హంగులతో జూలై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. 

తాజాగా నటి రాశీఖన్నా తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను (Raashi Khanna Youtube Channel) ప్రారంభించారు. ఈ విషయాన్ని రాశి ఖన్నా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె తన ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలను, మేకప్ రహస్యాలను పంచుకున్నారు. 

Read More: Naga Chaitanya: నాగచైతన్య నిజంగా జెంటిల్ మెన్.. రాశీ ఖన్నా ప్రశంసలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?