దగ్గుబాటి రానా (Rana Daggubati) ‘విరాటపర్వం’ రిలీజ్‌ ఎప్పుడంటే?

Updated on May 06, 2022 11:46 PM IST
విరాట పర్వంలో రానా (Rana Daggubati)
విరాట పర్వంలో రానా (Rana Daggubati)

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ని చూసి అభిమానులు మరో మంచి సినిమా రాబోతోందని ఆశపడ్డారు. రానా, సాయిపల్లవి కాంబినేషన్‌ కోసం ఎంతగానో ఎదురుచూశారు.  2018లో శ్రీ విష్ణు హీరోగా తెరక్కిన నీది నాది ఒకే కథ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

కరోనా పాండమిక్‌కి ముందే మొదలైన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు వాయిదా పడడంతో ఆగిపోతూ వచ్చింది. ఈ సినిమాని పూర్తిచేయలేకపోయారని, రిలీజ్‌ చేయరనీ రకరకాల వార్తలు వచ్చాయి. ఎలాగోలా సినిమా షూటింగ్‌ పూర్తయింది. కొన్నిరోజులు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు కూడా ప్రచారమయ్యాయి. ఎన్ని వార్తలు వస్తున్నా చిత్రబృందం మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.

 థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత కూడా ఈ సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఆ వార్తలే నిజమని భావించారు అభిమానులు.

ఇక ఈ ఏడాది వరుసగా అన్నీ భారీ చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంతో సోలో డేట్ కోసం వేయిట్ చేశారు దర్శక, నిర్మాతలు. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ విరాటపర్వం ఎప్పుడు విడుదల కానుందో ఈరోజు 5 గంటలకు చెబుతామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో ప్రేక్షకులంతా ఆ వార్త కోసం ఎంత గానో ఎదురు చూశారు.  

కాగా, ఈ సినిమాలో రానా (Rana Daggubati) సరసన హీరోయిన్‌గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి, నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రియమణి, నందిత దాస్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!