అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) సర్‌ప్రైజ్‌.. పెళ్లి రోజును కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్

Updated on May 06, 2022 11:38 PM IST
జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (NTR) ఫ్యామిలీతో ప్రశాంత్‌ నీల్ ఫ్యామిలీ
జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (NTR) ఫ్యామిలీతో ప్రశాంత్‌ నీల్ ఫ్యామిలీ

ఆర్‌ఆర్‌ఆర్‌ విజయంతో పాన్‌ ఇండియా స్టార్ల జాబితాలోకి చేరిపోయాడు జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR). ఈ సినిమా ఘన విజయంతోపాటు భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకి విమర్శకులు సైతం ప్రశంసించారు. అయితే మే 5న తమ పెళ్లి వార్షికోత్సవ సందర్భంగా ఓ అరుదైన ఫొటోని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఎన్టీఆర్‌. కేజీఎఫ్‌ చాప్టర్‌-2తో కలెక్షన్ల సునామీ సృష్టించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం చోయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. అయితే వీరిద్దరి పెళ్లి రోజులు ఒకే రోజున అంటే మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి తమ జీవితంలోని ప్రత్యేక రోజుని సెలబ్రేట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ భార్యాసమేతంగా దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘మా ఇరు జంటల వార్షికోత్సవం ఒకే రోజు కావడం వేడుకగా ఉంది. ఇది ఒక నూతన ఆరంభం’ అంటూ రాసుకొచ్చాడు. దాంతో ఎన్టీఆర్‌ షేర్‌ చేసిన ఫొటోలతో పాటు ఈ పోస్ట్‌ కూడా వైరలవుతోంది. ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతి, ప్రశాంత్‌నీల్‌-లిఖిత కలిసి దిగిన ఈ ఫొటోలు చూసి సంతోషిస్తున్న అభిమానులు ‘మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం వెయిటింగ్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌తో సినిమాలకు ఓకే చెప్పారు. అయితే ఇటీవల రిలీజైన ఆచార్య సినిమా డిజాస్టర్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో కొరటాల ప్రాజెక్టుకి కాస్త టైం ఇచ్చి ప్రశాంత్‌ సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. మూడో సినిమాతోనే ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకుని శాండిల్‌వుడ్‌ హీరోగా నిలిచిన ప్రశాంత్‌ నీల్‌ కూడా ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభించడానికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కాగా, మార్చి 24న రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌, ఏప్రిల్‌ 14న రిలీజైన కేజీఎఫ్‌-2 రెండు కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు రికార్డుల్ని తిరగరాశాయి. ఈ రెండు సినిమాలు దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ని కూడా షేక్‌ చేశాయి. టాలీవుడ్‌లో రాజమౌళికి సరితూగే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అంటూ సోషల్‌మీడియాలో అభిమానులు పోస్ట్‌లతో హోరెత్తిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ తీయబోయే సినిమా యాక్షన్‌ బేస్డ్‌గా ఉంటుందా, సెంటిమెంట్‌ని కూడా యాడ్‌ చేస్తాడా అనే అనుమానాలున్నాయి. అయితే సెంటిమెంట్‌ను పండించడంలో ఎన్టీఆర్‌ (NTR) తనకు తనే సాటి కావడంతో తప్పకుండా మంచి యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు.

కేజీఎఫ్‌-1తో యష్‌ని స్టార్‌ హీరోల జాబితాలో చేర్చిన ప్రశాంత్‌ చాప్టర్‌ 2తో పాన్‌ ఇండియా స్టార్‌ని చేశారు. అయితే కేజీఎఫ్‌-3 కూడా తీయాలంటూ అభిమానులు కోరుతున్నారు. వారి కోరికమేరకు మూడవ భాగం కూడా ఉంటుందని ప్రకటించాడు ప్రశాంత్‌. అయితే కొంత గ్యాప్‌ తీసుకుని కేజీఎఫ్‌-3ని తెరకెక్కిస్తానని మాటిచ్చాడు. రెండవ భాగం కలెక్షన్ల సునామీ ఆగకముందే మూడవ భాగం కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!